ఆయనెందుకు అలా అన్నాడు?
- Guest Writer
- May 1
- 2 min read

తన ఆత్మకథని ఒక చరిత్రాత్మక నవలగా చెప్పగల ఆత్మవిశ్వాసం ఎవరికుంది? ఒక్క శ్రీశ్రీకి తప్ప. ఆయనెందుకు అలా అన్నాడు? తను జీవించిన కాలం లోని ఒదిదుడుకుల్ని, ఉత్తాన పతనాల్ని, మంచి చెడుల్ని, నైతికానైతికతల్ని.. అన్నింటినీ తన జీవితంలో ప్రతిబింబించాడు కనుక. అదే తన ఆత్మకథ ‘‘అనంతం’’లో ప్రతిఫలించాడు. దాన్ని ‘‘ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల’’ అన్నాడు.
అది చదివాక నాకు కలిగిన అభిప్రా యం ఏమిటంటే శ్రీశ్రీ అన్ని విమర్శలకూ అర్హుడు. అన్ని ప్రశంసలకూ పాత్రుడు. శ్రీశ్రీ మీద తీర్పులివ్వగలిగిన వారందరూ ఇవ్వొచ్చు. వారు చెప్పేది కరెక్టే కావొచ్చు. కానీ తన మీద తీర్పులిచ్చే అవకాశం కల్పించింది కూడా శ్రీశ్రీనే. అది ఎవరో ఆయన జీవితాన్ని దగ్గర నుండి చూసి చెప్పింది కాదు. లేదా ఆయన మీద అపరాథ పరిశోథన నిర్వహించి కనుక్కోలేదు. ‘‘అనంతం’’లో ఆయనేమి చెప్పాడు? ఏమీ చెప్ప లేదు నిజానికి. తన జీవితమనే అద్దంలో ఆ నాటి సమా జాన్ని చూపించాడు. ముఖ్యంగా ఆయన అనుభవించిన దారు ణ దరిద్రం చూపాడు. తన బలహీనతలు చూపాడు. తన పతనం చూపాడు. అప్పటి మానవసంబంధాలు చూపా డు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలోని దంద హ్యమాన జీవితం చూపాడు. తన జీవితంలోని, అప్పటి సమాజంలోని రోత గురించి చెప్పాడు. మనుగడ బీభ త్సం గురించి రాశాడు. వైరుధ్యపూరిత సమాజం విశ్వ సించే సమస్త విలువల్ని ధ్వంసం చేస్తూ బతికాడు. ధిక్కారంతో అనియంత్రిత జీవితంతో ఆయనో పెర్వర్ట్ గా కనబడతాడు. కానీ ధిక్కా రంలో సామాజిక విశ్లే షణ చేస్తాడు. తనలోని పాండిత్యానికి దృక్పధం జోడిర చకపోయి వుంటే ఆయనో మహాకవి అయుండేవాడు కాదు. కానీ అప్పటికి భారతదేశంలో కమ్యూనిస్టు సిద్ధాంతాలు వేళ్ళూనలేదు. ఆయనలోని సహజసిద్ధ తిరుగుబాటుదారుడే ఆయనకో దృక్పధం ఇచ్చాడు. సైద్ధాంతిక పరిచయంలేని హేతుబద్ధ దృక్పధం ఆయనది. చరిత్ర గురించి అవగాహన వుండాలే తప్ప నైతిక తీర్పులనవసరం. ‘‘ఆనంతం’’లో ఆయన తనని తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకున్నాడు. ఆయన్ని విలువల భావోద్వేగాలతో చూడటం కన్నా ఆబ్జెక్టీవ్గా చూడాలి. ‘‘అనంతం’’లో శ్రీశ్రీ ‘‘రామాపురం బోర్డు రామాపురానికి దారి చూపిస్తుందే కానీ రామాపురం పోదు’’ అంటాడు తన పరిమితుల్ని వివరిస్తూ. కానీ కవిగా ఒక సమాజాన్ని కొన్ని తరాల పాటు ప్రభావితం చేయగల అపరిమిత బలాఢ్యుడు ఆయన!
-అరణ్య క్రిష్ణ
మద్రాసులో చింతాద్రిపేటలో మిసెస్ బాకర్స్ అనే మేట్రన్ వుండేది. ఆవిడ 5 రూపాయల మొదలు రూ.500 దాకా అమ్మాయిలను సప్లయి చేసేది. నేను పేదవాడ్ని. 5 రూపాయల వాడ్ని .ఎప్పుడైనా 5 రూపా యలు వుంటే అక్కడికి వెళ్లేవాడ్ని. 5 రూపాయల అమ్మాయిల వరస నా ఎదుట నిలబడేది. అందులో చర్మం, ఎముకలువున్న అమ్మాయిని నేను ఎంచుకొనేవాడ్ని. నాకు తెలుసు ఆ మాదిరి పిల్లలకి గిరాకి వుండదని. అందుకే నేను కావాలని ఆ అమ్మాయిని అడిగేవాడ్ని. మేం ఇద్దరం ఇంగ్లీషులో మాట్లాడుకునేవాళ్ళం. చాలా చాలా కృతజ్ఞత చెప్పేది ఆ అమ్మాయి. ఆ పిల్లపేరు మరి చిపోయాను. అలాంటివాళ్ళకి నా జోహారు.ఔను మళ్ళీ చెబుతున్నాను, ప్రేమమీద నాకు నమ్మకం లేదు. మనుష్యులమీద నమ్మకం ఉంది. శ్రీరంగం వెంకటరమణమ్మ నా మొదటి భార్య. నా దరి ద్రపు రోజుల్లో ఒకసారి ఆమెను అడిగేను, ఎవడైనా ఒక పెద్ద ఉద్యోగి నాకు నౌఖరి ఇస్తాడుగాని, నువ్వందుకుగాను వాడిదగ్గరికి వెళ్ళగలవా? అని. తప్పకుండా వెళ్తానంది మా ఆవిడ. ఈ నిజా యితీని నేను హర్షించాను. నాకు ఉద్యోగం ఇచ్చేవాడూలేడు, వాడి దగ్గరకు మా ఆవిడ వెళ్లనూ లేదు. సావిత్రి తన భర్తను బ్రతికించుకోవడానికి యముడితో పోయిందని చలంగారు రాస్తే చాలా మందికి కోపం వచ్చింది. ఇది చలంగారి అయిడియాకాదు. మోరిస్ నూటర్ మిక్ ది. అయినా, ఇటువంటి భావాలకి మన భారతీయాత్మ విరుద్ధం అంటారు. అసలు ఆత్మ అనేదేలేదు. భార తీయ అనేది మరీ విరుద్ధం. అవును. అవి నా దరిద్రపు రోజులు. రెండేసి రోజులు తిండిలేకుండా బ్రతికాను. ఆ పది సంవత్సరాల్లోనే మహాప్రస్థాన గీతాలు రాశాను. అంత దరిద్రంలోనూ నేనెవ్వరినీ ‘దేహీ’ అని యాచించలేదు. కేరమ్సులో గెలిచిన కప్పుల్ని అమ్ముకున్నాను. కవిత్వాన్ని కూడా అమ్ముకున్నాను. ఇది వ్యభిచారం అని నాకు తెలుసు. 1938లో జర్నలిజంలో ప్రవేశించాను. ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ గా రాయిటర్ వార్తలు తెలిగించాను. సక్కుబాయి పిండిరుబ్బినట్లు నా దరిద్రం నన్ను కొరుక్కుని తింటున్నదా లేక నేను నా దారిద్రాన్ని కొరుక్కుని తింటున్నానా అని. అదీ సమస్య.’’చింకిగుడ్డల సింహం’’ అనే అసంపూర్ణ గీతం ఆ రోజుల్లోనే ఆలపించాను. సింహం ఆ రోజుల్లో నా ఆదర్శం. పది సంవత్సరాల దరిద్రం, అందులోంచి ప్రభవించింది నా కవిత్వం. నేనో కాకినీ, ఏకాకిని. తెల్ల కాకివి. కాకిలేని చోటులేదు. అయితే అన్ని కాకులు నల్లగానే ఉంటాయి. నేనొక్కడ్నే తెల్లకాకిని. ఎందుచేతనంటే నా మనస్సు తెల్లనిది. నా హృదయం తెల్లనిది. నాది తెలుపురంగు. అయినా నేను కాకినే.
Comments