top of page

ఉగ్ర పోషకులపై సైనిక చర్చే సరైనది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 7
  • 2 min read

పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రతండాలను నామరూపాల్లేకుండా ఏరివేయడం భారత్‌కు అత్యవ సరం. ఇది ఎంత అవశ్యమో తెలియాలంటే చాలా ఏళ్ల క్రితం నాటి ఒక ఘటన గురించి తెలు సుకోవాలి. బెనజీర్‌ భుట్టో పాకిస్తాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెంది నవారు ఒక భారతీయ నిఘా అధికారిని ఎత్తుకెళ్లారు. ఆయన తన మూడేళ్ల పదవీకాలం ముగించు కుని భారత్‌కు తిరిగి వచ్చేయడానికి ఒక్కరోజు ముందే ఇది జరిగింది. అతన్ని స్వదేశానికి తీసుకురా వడానికి భారత ప్రభుత్వం చేసిన యత్నాలు ఫలించలేదు. మరోవైపు ఆ అధికారిని చాన్నాళ్లు ఐఎస్‌ఐ తీవ్రంగా హింసించినా అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఐఎస్‌ఐ అతడిని కారు ప్రమాదంలో చంపాలని నిర్ణయించుకుంది. ఈలోగా మన అధికారి ఎలా అదృశ్యమయ్యారో భారత నిఘా అధికారులు కనుగొన్నారు. ఇస్లామాబాద్‌కు అల్టిమేటం జారీ చేశారు. తమ అధికారి సురక్షి తంగా రాకపోతే న్యూఢల్లీిలో ఉన్న పాకిస్తాన్‌ అధికారులకు అదే గతి పడుతుందని భారత్‌ స్పష్టమైన సందేశం పంపింది. ఇది బాగా పనిచేసింది. సదరు అధికారిని బేషరతుగా విడుదల చేయాలని బెన జీర్‌ భుట్టో ఐఎస్‌ఐని ఆదేశించారు. దాంతో చివరి నిమిషంలో ఐఎస్‌ఐ సృష్టించిన ప్రమాదం నుంచి భారత అధికారి గాయాలతో బయటపడి ఢల్లీి చేరుకున్నారు. 1970ల కాలం నుంచే పాక్‌ పాలకు లకు ఈ తరహా మనస్తత్వం బాగా అలవాటు. ఆఫ్ఘన్‌పై సోవియట్‌ ఆక్రమణ తర్వాత తాము పాలు పెంచి పోషించిన ముజాహిదీన్‌ల బలం.. అమెరికా, సౌదీ అరేబియా, బ్రిటన్‌ దేశాల నుంచి వచ్చిన ఉదార సాయంతో పాక్‌ పాలకులు చెలరేగారు. తాము ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చని, తమను అడ్డుకునేవారే ఉండరనే ధీమా పెరిగిపోయింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు సాయం చేయడానికి ఇదే ప్రధాన కారణం. కానీ మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు, భారత్‌ దూకుడుతో పరిస్థితి మునుపటిలా లేదు. కార్గిల్‌ యుద్ధం సందర్భంగా ఇటువంటి ఘటనే జరిగింది. డజన్ల కొద్ది పాకిస్తాన్‌ ఆక్రమణదారులను పట్టుకుని భారత్‌ ఉరితీసింది. ఈ ఘటనపై ఇస్లామాబాద్‌ ఏమీ చేయలేకపోయింది. ఎందుకుంటే కార్గిల్‌ చొరబాటుదారులు తమ వారు కాదని అంతకుముందే ప్రకటించింది. తాము భారత చట్టాలకు అతీతులమని ఉగ్రవాడులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం 2020-24 మధ్య దాదాపు 20 లక్షిత హత్యలు జరిగాయి. వీరిలో ఎక్కువ భాగం జైష్‌ ఏ మహ్మద్‌, లష్కర్‌ ఏ తోయిబాలకు చెందిన టాప్‌ నాయకులే కావడం గమ నార్హం. ఈ రెండు సంస్థలను భారత్‌లో నిషేధించారు. ప్రపంచ దేశాలు కూడా వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి. ఖలిస్తానీ తీవ్రవాది పరమ్‌ జీత్‌ సింగ్‌ పంజ్వార్‌ కాల్చివేతకు గుర య్యాడు. లష్కర్‌ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ఇంటి సమీపంలో కారు బాంబు పేలింది. పాకిస్తాన్‌లో ఈ లక్షిత హత్యలు ఎలా ప్రారంభయ్యాయి? 2019లో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన కారుబాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ సైనికులు మరణించడం దీనికి ప్రధాన కారణం. ఈ హింసాత్మక చర్యను జైష్‌ ఏ మహ్మద్‌ గర్వంగా ప్రకటించుకుంది. పశ్చిమ దేశాల్లో నివసించే ఖలిస్తానీలు క్రమం తప్పకుండా పాకిస్తాన్‌ను సందర్శించేవారు. ఈ లక్షిత హత్యలతో వారు ఉలిక్కిపడి తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. చాలామంది జేఏఎం, ఎల్‌ఈ టీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇది జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ఆపలేదు కానీ గణనీయంగా తగ్గించడంలో సాయపడిరది. పహల్గాం ఉగ్ర దాడితో ఐఎస్‌ఐ తన బుద్ధిని మార్చుకోలేదని అర్థమవుతుంది. అందువల్ల ఉగ్రవాదులను, వారిని పోషిస్తున్న వారిని పాకి స్తాన్‌తో సహ ఎక్కడ ఉన్నా నిర్మూలించడం అత్యవసరం. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ పాకిస్తాన్‌ దశాబ్ధాలుగా భారత విషయాల్లో నేరుగా కలుగుజేసుకుంటూ ఇబ్బందులు సృష్టిస్తోంది. పాకిస్తాన్‌లో నిజమైన అధికారం సైనిక- గూఢచార వ్యవస్థ చేతుల్లోనే ఉంది. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. పాకిసాన్‌ సమాజాన్ని ఇతర దేశాలతో పోల్చకూ డదు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులను, వారిని నడిపేవారిని అంతమొందించడానికి బహిరంగ సైనిక చర్యే మెరుగైన, ఉత్తమమైన ఎంపిక అవుతుంది. ఇది దేశానికి ఎంతో మేలు చేసే అంశం అవు తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page