కలెక్టర్, ఎస్పీలకు ఎస్టీ కమిషన్ నోటీసు
- NVS PRASAD
- Jul 13, 2024
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మూడు తరాల నుంచి తాము సాగు చేస్తున్న భూములు ఇప్పుడు తనవంటూ ఊణ్ణ సత్యనారాయణ గుప్త విక్ర యించేస్తున్నారని, జలుమూరు మంజలం మర్రివలస పంచాయతీ మాకివలస గ్రామానికి చెందిన ఆదివాసీలు బోడవలస, ఉత్తరయ్యతో పాటు మరికొందరు గత నెల 25న జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ రాధికకు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఓల రోజుల్లోగా దీనిపై తమకు సమాధానం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో కొత్త గా వచ్చిన కలెక్టర్ పేరు చేర్చకపోవడంతో పాత కలెక్టర్ మనజీర్ జిలానీ పేరుతోనే ఎస్టీ కమిషన్ నోటీసులిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మాకివలస గ్రామంలో 50 ఎస్టీ కుటుంబాలు మూడు దశాబ్దాలుగా అక్కడ కొంత భూమి ని సాగు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఊణ్ణ సత్యనారాయణ గుప్త అనే వ్యక్తి ఇక్కడ తనకు 150 ఎక రాల భూమికి పట్టా ఉందని, అలాగే మాకివలస గ్రామం లో కూడా తమ భూమి ఉందంటూ ఇటీవల ఈ భూమి మీదకు రావడంతో గొడవ ప్రారంభమైంది. ఆదివాసీల్లో 90 ఏళ్ల మహిళ సమాచారం ప్రకారం ఆమె తాతల నుంచి ఇది వారి సాగులో ఉందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆదివాసీలకు, గుప్తకు మధ్య తగాదాలు జరు గుతున్నాయి. గ్రామంలో ఇళ్ల మధ్య సరిహద్దు రాళ్లు పాతి ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో రాష్ట్ర ఆదివాసీ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగి దీనిపై కలె క్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీ లన చేసి గుప్తకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదని తెలుస్తుంది. జిల్లా చరిత్రలోకి వెళితే.. ఆదివాసీల భూము లు దురాక్రమణ చేసి తప్పుడు పద్ధతుల్లో భూములు కాజేస్తే భూమి సమస్యే ప్రధానంగా 1960లో శ్రీకాకుళం గిరిజన ఉద్యమం నడిచింది. అప్పట్లో ఈ ఉద్యమానికి సమాజంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఈ భూమి తమదంటూ సత్యనారాయణ గుప్త రావడంతో దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని వాబ యోగి కోరుతున్నారు. అదే సమయంలో మూడు తరాల నుంచి ఇక్కడ గిరిజనుల సాగులో ఉన్న 70 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు తన పేరిట తయారు చేయించుకోడానికి గుప్త ప్రయత్నిస్తున్నారని గతంలో కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివాసీలు వేసిన పంటలు నాశనం చేయడంతో ఇంతకు ముందు జలుమూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయితే సమస్య పెద్దదవుతుండటంతో వీరు జాతీయ ఎస్టీ కమి షన్ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్కు, ఎస్పీకి ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Comentarios