
నూటానలభై కోట్ల మంది ఉన్న భారతదేశంలో కొన్ని వస్తువులు, సేవల మీద ఖర్చు చెయ్యడా నికి వంద కోట్లమంది వద్ద డబ్బు లేదని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. దేశంలో వ్యాపార సంస్థలు లేదా స్టార్టప్లకు అత్యంత కీలకమైన వినియోగదారులు 13 లేదా 14 కోట్ల మంది మాత్రమే ఉన్నారని బ్లూమే వెంచర్స్ అనే పెట్టుబడుల సంస్థ అధ్యయనంలో తేలింది. మరో 30 కోట్లమంది ఔత్సాహిక వినియోగదారులు ఈ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారు గానీ పర్సులు తెరిచేందుకు ఇబ్బంది పడుతున్నారనీ, డిజిటల్ పేమెంట్స్ విషయంలో వారు చెల్లింపుల దగ్గరకు వచ్చేసరికి ఆఫ్ బటన్ నొక్కుతున్నారనీ పేర్కొంది. ఈ నివేదికలో ఇంకా ఏముందంటే, ఆసియాలో అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల వర్గం ఇంకా విస్త రించడంలేదు. దీనర్థం ఏంటంటే భారతదేశంలో సంపన్నులు, సంపాదిస్తున్న వారి సంఖ్య వాస్తవం గా పెరగడం లేదు. బాగా డబ్బున్నవారి సంపద మాత్రమే పెరుగుతోంది. ఇవన్నీ దేశంలో వినియో గదారుల మార్కెట్ను వివిధ మార్గాల్లో రూపొందిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రీమియర్ ఉత్పత్తుల ధోరణి పెరుగుతోంది. ఇందులో బ్రాండ్లు మార్కెట్లో భారీగా ఆఫర్లు ఇవ్వడం కంటే, తమ ఉత్పత్తులను మెరుగుపరిచి, ఖరీదైన ఉత్పత్తుల్ని రెట్టింపు చెయ్యడం ద్వారా సంపన్నులకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న అల్ట్రా లగ్జరీ గేటెడ్ హౌసింగ్, ఖరీదైన ఫోన్లు అమ్మకాలు పెర గడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఇళ్లు, ఫోన్లు, ఇతర వస్తువుల దిగువ శ్రేణి బ్రాండ్లు మార్కెట్లో నిలబడేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న నివాస గృహాల మార్కెట్ ఐదేళ్ల కిందట 40 శాతం ఉండేది. అది ప్రస్తుతం 18 శాతానికి పడి పోయింది. బ్రాండెడ్ వస్తువుల అమ్మకాల మార్కెట్ వాటా బాగా పెరిగింది. భారతదేశంలో ఆనం దాన్ని జుర్రుకుని, చిరకాలం గుర్తుండిపోయే కార్యక్రమాలకు ఖర్చు చేసే ‘ఎక్స్పీరియన్స్ ఎకానమీ’ మరింతగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ కళాకారులైన ఎడ్ షీరన్ లాంటివారు నిర్వహించే కచేరీలకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ మార్పును అనుసరిస్తున్న సంస్థలు అభివృద్ధి చెందు తాయని ఈ నివేదిక రూపొందించిన రచయితలలో ఒకరైన సజిత్ పాయ్ చెప్పారు. కోవిడ్ తర్వాత భారతదేశంలో ఆర్థిక పునరుత్తేజం ‘కె’ ఆకారంలో ఉందన్న దీర్ఘకాలపు అభిప్రాయాలను ఈ నివేదిక లో అంశాలు బలపరుస్తున్నాయి. ఇక్కడ ధనికులు మరింత ధనికులు అయ్యారు. పేదలు కొనుగోలు శక్తిని కోల్పోయారు. వాస్తవానికి, ఈ పరిణామం కోవిడ్ కంటే ముందే ప్రారంభం అయింది. దేశం లో ఆర్థిక అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. 1990లో జాతీయ ఆదాయంలో 10శాతం మంది దగ్గర 34 శాతం సంపద మాత్రమే ఉండేది. అది ప్రస్తుతం 57.7 శాతానికి చేరుకుంది. మిగతా సగం జాతీయ ఆదాయాన్ని పంచుకుంటున్న వారి సంఖ్య 22శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. వినియోగ తిరోగమనం ప్రజల కొనుగోలు శక్తిని ధ్వంసం చెయ్యడమే కాకుండా వారి పొదుపు తగ్గి పోయి, అప్పులు పెరిగేలా చేసింది. కోవిడ్ తర్వాత ప్రజలకు తేలిగ్గా అందుబాటులోకి వచ్చిన హమీ అక్కర్లేని రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరించింది. భారతదేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న ఆశావహులైన వినియోగదారుల వర్గం అలాంటి రుణాల వల్లనే పుట్టుకొచ్చింది. కేంద్ర బ్యాంకు ఆ రుణాలను కట్టడి చెయ్యడం వినియోగాన్ని ప్రభావితం చేసింది. భారతదేశపు వినియోగ దారుల మార్కెట్కు మూల స్తంభంగా ఉన్న మధ్య తరగతి వర్గాన్ని పీల్చి పిప్పి చేశారని, వారి ఆదాయం చాలా కాలం నుంచి ఒకేలా ఉందని మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజర్లు రూపొందించిన నివేదిక చెబుతోంది. గత పదేళ్లుగా భారతదేశంలో పన్ను చెల్లిస్తున్న వారిలో 50 శాతం ప్రజల ఆదా యం స్తబ్ధుగా ఉంది. ఇది వాస్తవంలో వారి ఆదాయం సగానికి తగ్గడాన్ని సూచిస్తుందని జనవరిలో ప్రచురితమైన నివేదిక చెబుతోంది. ఆర్థికంగా పెరుగుతున్న భారం మధ్య తరగతి ప్రజల పొదుపును దాదాపు ఖాళీ చేసింది. భారత దేశంలో కుటుంబాల నికర పొదుపు 50 సంవత్సరాల కనిష్ట స్థాయి కి చేరుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది. దీని వల్ల మధ్య తరగతి ప్రజలు వినియోగించుకునే వస్తువులు, సేవలకు డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పడిపో తుందని నివేదిక సూచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల నగరాల్లో క్లరికల్, సెక్రటేరియల్, ఇతర ఉద్యోగాలు క్రమేపీ కనుమరుగవుతున్నాయని మార్సెల్లస్ రిపోర్ట్ పేర్కొంది.
Commentaires