top of page

పవన్‌కు ఇవి తెలుసా..?!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 21, 2024
  • 2 min read

సనాతనవాదం పులి మీద స్వారీ వంటిది. ఒకసారి పులినెక్కిన వారు అది ఎక్కడికి తీసుకుపోతే అటు పోవాల్సిందే. వారాహి ప్రకటన సందర్భంగా చేసిన సనాతన విన్యాసాల మీద సామాజిక మాధ్యమంలో అనేక మంది అంతకంటే ఎక్కువగా స్పందించి చీల్చి చెండాడుతూ సంధించిన ప్రశ్నలకు ఎక్కడా సమా ధానం రాలేదు. బహుశా ఇలా జరుగుతుందని అనుకొని ఉండరు. పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద విరుచుకుపడిన మాటలు ఇంకా చెవుల్లో మోగుతుండగానే సనాతనులకు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పుకొనేవారు చేసిన పనికి సభ్య సమాజం సిగ్గుపడిరది. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన కేసులో నిందితులైన పరశురామ్‌ వాగ్మోరే, మనోహర్‌ అనే వారిని కర్ణాటక సనాతన లేదా హిందూత్వ శక్తులు విజయపురాలో 2024 అక్టోబరు 11న సన్మా నించాయి. పవన్‌ కల్యాణ్‌ ఈ వార్తను చదివారో లేదో తెలియదు. ఒకవేళ చదివినా ఆ కేసులోని వారు ఇంకా నిందితులే తప్ప నేరం రుజువు కాలేదుగా అని లా పాయింట్‌ తీసి సనాతనులను సమర్ధించవచ్చు. అందుకే మరికొన్ని ఉదంతాలను పేర్కొనాల్సి వస్తోంది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై గోద్రా అనంతర మారణకాండ సందర్భంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన సంగతి తెలిసిందే. అత్యాచార కేసులో నేరగాళ్లలో పరివర్తన కలిగి మంచివారుగా మారారంటూ అక్కడి సనాతనవాదుల ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఆ సందర్భంగా వారిని సనాతన ధర్మాన్ని లేదా హిందూత్వను కాపాడేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకొనేవారు సన్మానం చేసి, మిఠాయిలు పంచారు. సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష పడినవారు జైల్లో ఉండాల్సిందే. అయితే సదరు సదాచార సనాతనుల కేసులో ఆ తీర్పు రాక ముందే శిక్ష విధించినందున తర్వాత వచ్చిన తీర్పు వారికి వర్తించదని, పాత నిబంధనల ప్రకారం వారి సత్ప్రవర్తకు మెచ్చి మేకతోలు కప్పి ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే సుప్రీం కోర్టు ఆ చర్యను తప్పు పట్టి నేరగాళ్లను తిరిగి జైలుకు పంపింది. దీని మీద పవన్‌ కల్యాణ్‌ ఏమంటారో? సకల కళావల్లభుడిగా పేరుగాంచిన హంతకుడు, ఇద్దరు మహిళలపై అత్యాచార నేరగాడు, ప్రవచనకారుడు డేరా బాబా జీవిత ఖైదు అనుభవిస్తూ బెయిల్‌ మీద వచ్చినపుడు హర్యానా బీజేపీ నేతలు ఆశీస్సులు పొందారు. అతగాడి అనుచరుల ఓట్లు పొందేం దుకు గాను తాజా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరోల్‌ మీద బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిం దనే విమర్శలు వచ్చాయి. 2018లో జమ్మూలోని కథువాలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారికి మద్దతుగా అక్కడ హిందూ ఏక్తా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శన తెలిసిందే. మహిళను దేవతగా కొలిచే సమాజంలో దాని గురించి రోజూ ప్రవచనాలు చెప్పే శక్తులే ఈ ఉదంతాలకు పాల్పడ్డాయంటే దేశం ఎటుపోతోందని కాదు, కొంతమంది ఎటు తీసుకుపోతున్నారో జనం ఆలోచించాలి. డేరాబాబాకు 2017లో శిక్ష పడిరది, అప్పటి నుంచి ఉత్తరాదిన ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పెరోల్‌ ఇవ్వటం గమనిం చాల్సిన అంశం. బిల్కిస్‌ బానో ఉదంతంలో నేరస్థులను సమర్ధించటంలో మతాన్ని కూడా జోడిరచిన దుర్మార్గం, దాన్ని నిస్సిగ్గుగా సమర్ధించిన ఉన్మాదం కనిపిస్తుంది. వారంతా సనాతనులే. మతాలతో నిమి త్తం లేకుండా అత్యాచారం ఎవరి మీద జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచా రంలో ఢల్లీి నిర్భయ కేసును ప్రస్తావించిన మోడీ తమ ఏలుబడిలో జరిగిన కథువా, ఉన్నావో అత్యాచా రాల తర్వాత మాట్లాడుతూ సాధారణ పరిభాషలో ఖండిరచారే తప్ప వాటి ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఎందుకంటే కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా బీజేపీ మంత్రులు కూడా ప్రదర్శనల్లో పాల్గొ న్నారు. వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాల్సి ఉండగా విమర్శలు పెరగటంతో తీరికగా తర్వాత రాజీనామా చేయించారు. ఉన్నావో ఉదంతంలో బీజేపీ ఏంఎల్‌ఏ దోషి, ఇప్పుడు జీవితకాల ఖైదు అను భవిస్తున్నాడు. గత రెండేళ్లలో ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం డేరాబాబాకు పదకొండుసార్లు బెయిల్‌ ఇచ్చి బయటకు వదిలింది. ఏడుసార్లు వేర్వేరు చోట్ల ఎన్నికలకు ముందు బెయిల్‌ ఇచ్చారు. తాజాగా ఎన్నిక లకు కొద్ది రోజుల ముందు అదే జరిగింది. బీజేపీకి ఓటు వేయాల్సిందిగా అనుచరులకు సందేశం పంపాడు. అతగాడి ఆశ్రమం ఉన్న సిర్సా జిల్లాలోని ఐదు అసెంబ్లీ సీట్లలో బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు. సనాతనవాదుల మందలో కొత్తగా చేరిన పవన్‌ తాను ఎన్నో చదివానని చెప్పిన తర్వాత ఆ వాదాన్ని భుజాన వేసుకున్నారు గనుక అమాయకుడని అనుకోలేం. మర్రిచెట్టు వంటి చంద్రబాబు నీడలో ఎంతకాలం ఉన్నా ఎదుగూ బొదుగూ ఉండదు కనుక తాను ప్రత్యేకంగా కనిపించాలంటే సనాతనాన్ని భుజాన వేసుకున్నట్లు కొందరు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page