
లెబనాన్, సిరియాలలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్నది కచ్చితమైన రిపోర్టులు లేవు. ఐఫోన్లు కూడా పేలినట్లుగా తెలుస్తోంది. తక్కువ ధరకి ఐఫోన్ వస్తే ఎవరు కొనకుండా ఉండగలరు? తక్కువ ధరకి ఎవరు ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలి కదా? ఐఫోన్ అనేది భద్రత విషయంలో చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది అని ప్రచారంలో ఉంది. అఫ్కోర్స్! ఐఫోన్ మొదటిసారిగా 2007లో మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ఓఎస్ చాలా పటిష్టంగా ఉంది అని నిపుణులు చెప్పారు. 2015లో మొదటిసారిగా ఒక హ్యాకర్ ఆపిల్ స్టోర్లోకి చొచ్చుకువెళ్లి ఐస్టోర్లో ఉన్న ఐట్యూన్స్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా మార్చేశాడు! అక్కడితో ఆగకుండా ఐమాక్, ఐఫోన్ యాక్ససరీస్ ధరలని అన్నిటిని ఒక డాలర్ కింద మార్చేశాడు. తర్వాత కొద్ది గంటల్లలోనే యాపిల్ తన రక్షణ వ్యవస్థని సరిచేసుకుంది.
సమాచార విప్లవంలో యూదుల పాత్ర తిరుగులేనిది! కాబట్టి కంపెనీ, బ్రాండ్ అనేవి మార్కెటింగ్కి సంబంధించినది! టెక్నాలజీ యూదుల చేతిలో ఉంటూ వచ్చింది, ఇక ముందు కూడా ఉంటుంది! తప్పించుకోవడం కష్టం! చైనాకి ఈ విషయం తెలుసు కాబట్టి హైవాయుని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నది!
పేలిపోయిన పేజర్లు, స్మార్ట్ ఫోన్ల నుండి డాటాని రిట్రీవ్ చేసిన మోస్సాద్ హెజ్బొల్లా అంతర్గత రహస్య డాక్యుమెంట్ని కనుక్కుంది. డాటాలో ఎంతమంది ఎలా గాయపడ్డారు, చనిపోయారో వివరాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ని హెజ్బొల్లా మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తున్నది! మొత్తం 879 మంది పేజర్లు, వాకీటాకీలు పేలిపోవడం వల్ల మరణించారు. చనిపోయిన వారిలో 131 మంది ఇరాన్ దేశంకి చెందిన వాళ్ళు, 79 మంది యెమెన్ దేశానికి చెందిన వాళ్ళు, 291 మంది హెజ్బొల్లా సీనియర్ ఆఫీసర్లు! తీవ్రంగా గాయపడిన వారు 602 మంది. వీళ్లు తమ పనులు తాము చేసుకోలేని విధంగా గాయపడ్డారు కాబట్టి మరణించిన వారితో సమానం. కళ్ళు కోల్పోయినవారు 509 మంది. జననేంద్రియాలు కోల్పోయినవారు 1735 మంది.
ట్రోజాన్ హార్స్ని ఉపయోగించి ఇంతమందిని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారి! ఇక లాప్టాప్లు, డెస్క్టాప్ కంప్యూటర్లు పేలడానికి సిద్ధంగా ఎన్ని ఉన్నాయో తెలీదు. హెజ్బొల్లా దగ్గర ఉన్న వీటిని ఆన్ చేయగానే మోస్సాద్కి తెలిసిపోతుంది కాబట్టి వాటిని ఇకముందు ఆన్ చేయబోరు. పోనీ ట్రోజాన్ హార్స్ని రిమూవ్ చేసే టూల్స్తో దానిని తీసేయాలి అంటే ముందు అది ఎలా పనిచేస్తుందో, దాని పేరు ఏమిటో దానిని రిమూవ్ చేసే టూల్ డాటాబేస్లో ఉండాలి కానీ అది ఉండదు. సాధారణంగా ట్రోజాన్ హార్స్ రిమూవ్ చేసే టూల్స్ ఉచితంగా దొరుకుతాయి కానీ మోస్సాద్ క్రియేట్ చేసిన ట్రోజాన్కి పేరు ఉండదు. ఏదన్నా యాంటీవైరస్ సంస్థ పరిశోధన చేసి దానికి పేరు పెట్టి రిమూవ్ చేసే టూల్ డేటా బేస్ని క్రియేట్ చేయాలి. ఒక్కరి కోసం ఏ సంస్థ కూడా ఆ పని చేయదు. ఒకవేళ హెజ్బొల్లా పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపినా ఆ విషయం మోస్సాద్కి తెలిసిపోతుంది! ఒక్క మాటలో చెప్పాలి అంటే కంప్యూటర్లు విస్తృతంగా వాడుకలోకి రావడం మొదలైన కొత్తల్లో వైరస్లను సృష్టించి, వాటికి విరుగుడుగా యాంటీవైరస్ కంపెనీలు అభివృద్ధి చెందడానికి కారకులు యూదులు! కట్ చేస్తే యాంటీవైరస్ బిజినెస్ అనేది ఇప్పుడు 5 బిలియన్ డాలర్ల వ్యాపారం! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
పొట్లూరి పార్థసారధి
Comments