బడ్జెట్ గుట్టు.. ఆమె చీర చెప్పేస్తుంది!
- NVS PRASAD
- Feb 5
- 2 min read
నిర్మలా సీతారామన్ అంకెలపై విశ్లేషకులు కుస్తీ పట్టక్కర్లేదు
ఆమె కట్టుకున్న చీర ఏ రాష్ట్రానిదో చెప్పగలిగితే సారం తెలిసినట్టే
వరుసగా ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో రాష్ట్రాల ప్రాధాన్యత పసిగట్టేస్తున్న మహిళలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కట్టుకున్న చీరను బట్టి ఏ రాష్ట్రానికి ఆ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారో ఇకనుంచి ఇట్టే పట్టేయొచ్చు. కేంద్ర బడ్జెట్ పాఠాన్ని పూర్తిస్థాయిలో వినిపించకముందే టీవీ డీబేట్లలో మాట్లాడే విశ్లేషకులు ముందుగా ఇంటి నుంచి బయల్దేరినప్పుడు సీతారామన్ కట్టుకున్న చీరేమిటో టీవీలో చూసి చెప్పమని ఓసారి అడిగితే సరిపోతుంది. ఎందుకంటే.. గడిచిన రెండు బడ్జెట్ ప్రవేశాల నుంచి నిర్మలా ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారు. 2025 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె కట్టుకున్న చీరను దేశవ్యాప్తంగా మహిళలు ఆసక్తిగా గమనించారు. మంచి రంగుతో చేనేత మీద కళంకారీ డిజైన్ ఉన్న ఆ చీర ఎంత బాగుందో అని బుగ్గలు నొక్కుకున్నారు. కానీ నిర్మల మాత్రం ఆ చీర వెనుక ఓ చరిత్ర ఉందని చెప్పే ప్రయత్నం, ఆ చరిత్ర కలిగిన రాష్ట్రానికే ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతం పంపడానికే ఆ చీర కట్టుకున్నారు. ఈ చీర పేరు మధుబని. ఇది కళంకారీ తరహా చేతినేత చీరే. దీంట్లో ప్రావీణ్యం గడిరచిన దులారీదేవికి కేంద్ర ప్రభుత్వం 2020`21లో పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. దులారీదేవి బీహార్కు చెందిన మహిళ. అలాగే మధుబని కళ కూడా బీహార్దే. రామాయణంలో మిథిలానగరాన్నే ఇప్పుడు బీహార్గా వ్యవహరిస్తున్నారని, సీతాదేవి వివాహానికి జనక మహారాజు మధుబని చీరనే కట్టించారని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు నిర్మల అదే చీర కట్టుకొని 2025 బడ్జెట్లో బీహార్కు వరాల జల్లు కురిపించారు.
సీన్ కట్ చేస్తే.. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే నిర్మలా సీతారామన్ జార్ఖండ్కు ప్రత్యేకమైన టస్సార్ సిల్క్ చీర కట్టుకున్నారు. వెస్ట్బెంగాల్ నుంచి జార్ఖండ్ ప్రాంతానికే చెందిన టస్సార్ పట్టు సాధారణంగా ఓక్, నేరడి, అసన్, అర్జున్ చెట్లను తినే అంథేరియా మాత్ అనే పట్టుపురుగు గూడుల నుంచి తీస్తారు. ఇందులో జీవహింస ఉండదని, ఈ పట్టు ప్రసిద్ధి. 2024లోనే జార్ఖండ్కు ఎన్నికలు ఉన్నందున ఆ బడ్జెట్లో ఆ చీర కట్టుకొని వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన రాష్ట్రానికి చెందిన మంగళగిరి చేనేత వస్త్రాన్ని ధరించారు. అందులో అమరావతిని రాజధానిగా ప్రకటించిన పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయిస్తే, దాన్ని ఈ బడ్జెట్ వరకు విడుదల చేస్తున్నారు. విశాఖ స్టీల్కు రూ.11,917 కోట్లు కేటాయించారు. 2028 వరకు 95.53 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీరు ఇవ్వాలని జలజీవన్ మిషన్కు నిధులిచ్చారు. విశాఖ పోర్ట్ట్రస్ట్ స్వావలంబనకు రూ.730 కోట్లు ప్రకటించారు. గడిచిన బడ్జెట్ సమావేశంలో రికార్డుస్థాయి టైమ్ను 2 గంటల 42 నిమిషాలు నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆమె చీర బీహార్దని, బీహార్కే బడ్జెట్ ఉందని అంత ప్రసంగం వినకపోయినా గత చరిత్ర చూసినవారికి అర్థమైపోయివుంటుంది. మురార్జీదేశాయ్ ఇప్పటి వరకు 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే, చిదంబరం 9 సార్లు, నిర్మలాసీతారామన్ 8 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Commentaires