ఇజ్రాయేల్ టెక్నాలజీకో దండం
వణికిపోతున్న హెజ్బుల్లా

‘‘మేము ఇంకా పూర్తిస్థాయి ఎటాక్ మొదలుపెట్టలేదు. అసలు ఆ అవసరం కూడా రాకుండా హెజ్బొల్లాని కట్టడి చేయగలం. ప్రతీ దాని మీదా మాకు నియంత్రణ ఉంది. మేము ఇజ్రాయేల్లో ఉంటూనే లెబనాన్, సిరియాలలో ఉన్న మా ప్రత్యర్థులని భయపెట్టగలం. ఇప్పటి వరకూ కేవలం కొద్దిపాటి టెక్నాలజీతో జరిగింది. మేము వాడాల్సిన టెక్నాలజీ ఇంకా చాలా ఉంది.’’ ..ఇజ్రాయేల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్! హెజ్బొల్లా ప్రతీకారం తీర్చుకుంటామంటూ భీకర ప్రతిజ్ఞ చేసిన దానిపై ఇజ్రాయేల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చేసిన బహిరంగ ప్రకటన అది.
పేజర్లు పేలడం వల్ల భయాందోళనలతో ఉన్న హెజ్బొల్లాకి వాకీ టాకీలు, వైర్లెస్ రేడియోలు, స్మార్ట్ఫోన్లు పేలడం అనేది అంతుబట్టడం లేదు. వాష్రూమ్లో కమోడ్లు పేలడం ఆశ్చర్యకరం. ఇంటి పైకప్పు మీద ఉన్న సోలార్ ప్యానల్స్ పేలడం ఆశ్చర్యకరం. అంతెందుకు ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎంతటి విధ్వంసానికి గురిచేస్తుందో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఐఓటీతో పనిచేసే ప్రతీ గాడ్జెట్ని పేల్చేయవచ్చా? సమాధానం అవును కాదు అని చెప్పవచ్చు. ప్రతీ గాడ్జెట్ని ఒకే వ్యక్తి లేదా సంస్థ చేతిలోకి వెళ్లాలంటే శక్తివంతమైన ఫైర్వాల్ని చేధించి చొచ్చుకుపోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని, కానీ అసాధ్యం కాదు. అలా అని ఆపలేమా అంటే అదీ సాధ్యమే.
ట్రోజాన్ హార్స్.. ఇది చాలా పురాతనమైన పద్ధతి. గ్రీకులు చెక్క గుర్రం లోపల మనిషిని ఉంచి శత్రుకోటలోకి ఆ గుర్రాన్ని చేర్చిన తర్వాత గుర్రం లోపల ఉన్న మనిషి బయటికి వచ్చి కోట పైనుంచి తాడుని కోట కిందకి వదిలేవాడు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ట్రోజాన్ హార్స్ అనే పేరుతో చిన్న స్టాండ్ ఎలోన్ ప్రోగ్రాంని పంపిస్తారు. ఇది ప్రకటనలు క్లిక్ చేస్తే, తెలియని మెయిల్స్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ లేదా మొబైల్లోకి వచ్చి చేరతాయి. ట్రోజాన్ హార్స్ ఎలా పనిచేస్తుంది? ఏదన్నా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత అది మొబైల్ అయినా, కంప్యూటర్ అయినా, టాబ్ అయినా దానిలోని డేటాని తనకి నిర్దేశించిన వారికి పంపుతూ ఉంటుంది.
ఉదాహరణకు పాస్వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ సమాచారాన్ని దొంగిలిస్తుంది. వాడేవారి యాక్టివిటీని అంటే ఎక్కడికి వెళుతున్నారు (జీపీఎస్ ఉండి ఉంటే), ఆన్లైన్లో ఏం చేసున్నారో లాంటి సమాచారాన్ని హ్యాకర్కి చేరవేస్తుంది. అవసరమైతే సదరు గ్యాడ్జెట్లో ఉన్న సిస్టమ్ ఫైల్స్ని నాశనం చేస్తుంది. హ్యాకర్ చేసిన ప్రోగ్రామింగ్ని బట్టి ఎలాంటి యాక్టివిటీ లేకుండా నిర్దేశించిన తేదీ, సమయంలో యాక్టివేట్ అయి చెప్పిన పని చేస్తుంది. ట్రోజాన్ హార్స్ మిగతా మాల్వేర్ల లాగా సిస్టమ్ ఫైల్స్లోకి వెళ్లి వ్యాప్తిచెందదు కాబట్టి వాడేవాళ్లకి అనుమానం రాదు!
మరి మోస్సాద్ ట్రోజాన్ హార్స్ని ఎలా ఇన్స్టాల్ చేసింది? హెజ్బొల్లాకి కావాల్సిన పేజర్లు, స్మార్ట్ఫోన్లు, వాకీటాకీలు, వైర్లెస్ రేడియోలు ఇరాన్లోని కొన్ని షెల్ (ప్రోక్సీ) కంపెనీలు ఆర్డర్ చేసాయి. మోస్సాద్కి ఇరాన్ ఒక ఆటస్థలం. మిగతా దేశాలలో కంటే ఇరాన్లోనే మోస్సాద్కి ఎక్కువ యాక్సెస్ ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇరాన్లోని అయితుల్లా అలీ ఖోమైనీ మత చాందస ప్రభుత్వం మీద అక్కడి ప్రజలలో ద్వేషం ఉంది. గత రెండేళ్లలో ఇరాన్లోని 10వేల మంది ప్రజలు ఇస్లాం నుంచి క్రైస్తవంలోకి మారిపోయారు. ఇరాన్ ప్రజలు స్వచ్ఛందంగా మోస్సాద్కి సహకరిస్తున్నారు. హెజ్బొల్లా ఇరాన్లోని షెల్ కాంపెనీల ద్వారా ఇచ్చే ఆర్డర్లు వాటి సమాచారం మొత్తం షెల్ కంపెనీలో పనిచేసే ఉద్యుగులే మోస్సాద్కి సమాచారం ఇస్తున్నారు. కానీ హెజ్బొల్లాకి ఈ విషయం తెలియదు. నాలుగు నెలల క్రితం హెజ్బొల్లా 4వేల పేజర్స్ కోసం ఇరాన్లోని షెల్ కంపెనీ ద్వారా ఆర్డర్ ఇచ్చింది. మోస్సాద్ కోసం పని చేస్తున్న ఉద్యోగులు విషయం చేరవేశారు. బల్క్లో పేజర్లు తయారుచేసేది తైవాన్ మాత్రమే. ఆర్డర్ తైవాన్లోని గోల్డ్ అపోలో కంపెనీకి వెళ్లింది. ఇక్కడి వరకూ అంతా సవ్యంగానే జరిగింది!
విలేకరులు తైవాన్లోని గోల్డ్ అపోలో సంస్థని సంప్రదించగా ఇరాన్ నుంచి మాకు ఆర్డర్ వచ్చిన మాట నిజమే కానీ ఆ లో-టెక్ పేజర్లు మేము తయారుచేయం అని, మా సంస్థ లైసెన్స్ కలిగిన బేస్ కన్సల్ట్, బుడాపెస్ట్, హంగేరీకి ఇచ్చామని పేర్కొంది. ఇక బుడాపెస్ట్లోని బేస్ కన్సల్ట్ కార్యాలయాన్ని సంప్రదించగా, ఎలాంటి స్పందన రాలేదు. క్రిస్టియనా (క్రిస్టియానా బర్సోనీ`ఆర్కిడియాకోనో, ఇటలీ) అనే ఇటలీకి చెందిన మహిళ బీఏసీ కన్సల్ట్కి సీఈవోగా ఉన్నట్లు ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో తెలుస్తున్నది. లెబనాన్, సిరియాలలో పేజర్లు పేలి సంచలనం సృష్టించిన రోజు నుంచి క్రిస్టియానా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మరోవైపు క్రిస్టియానా హంగరీ దేశ ఇంటెలిజెన్స్ రక్షణలో ఉన్నట్లు తెలుస్తున్నది. హంగరీ దేశం ముస్లిం శరణార్థులకి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించి యూరోపియన్ యూనియన్ పెనాల్టీకి గురైన సంగతి తెలిసిందే. కాబట్టి క్రిస్టియానా ఇప్పట్లో బయటికి రాదు.. విషయం ఏమిటో తెలియదు. ఇంతకీ బీఏసీ కన్సల్ట్ బుడాపెస్ట్లో ఒక అపార్ట్మెంట్లో ఆఫీస్ మాత్రమే ఉంది తప్పితే ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ కానీ, అసెంబుల్ చేసే షెడ్లు కానీ ఏమీ లేవు. అంటే ఇదీ ఒక షెల్ కంపెనీయే. ఒక షెల్ కంపెనీ నుంచి మరో షెల్ కంపెనీ ద్వారా లావాదేవీలు జరిగాయాన్నమాట. సో.. పేజర్లలో ట్రోజాన్ హార్స్ మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడం, పేలుడు పదార్థాన్ని పెట్టడం అంతా హంగరీలోనే జరిగింది.
పెంటాఎరిథ్రిటోల్! క్లుప్తంగా పీఈటీఎన్ అని పిలుస్తారు. పీఈటీఎన్ అనే పేలుడు పదార్ధాన్ని పేజర్లలో వాడినట్లు తెలుస్తున్నది. పీఈటీఎన్ పేలుడు పదార్థాన్ని పెద్ద పెద్ద బ్రిడ్జ్లని, పెద్ద భవనాలని కూల్చడానికి వాడతారు. హెజ్బొల్లా కొన్న ప్రతీ ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ మోస్సాద్ షెల్ కంపెనీలు సప్లై చేస్తూ వచ్చాయి కాబట్టి బయటికి కనపడకుండా పీఈటీఎన్ని అమర్చి సప్లైయ్ చేశారు. ఆఖరికి వాష్ రూమ్లలో వాడే కమోడ్లలో కూడా పీఈటీఎన్ని అమర్చి సప్లై చేశారు. వైర్లెస్ డిటోనేటర్ని కమోడ్లో పెట్టారు అంటే మోస్సాద్ కోసం పనిచేసే వాళ్లు హెజ్బొల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. గత ఐదు రోజులుగా లెబనాన్, సిరియాలలో హెజ్బొల్లా కోసం పని చేస్తున్నవారు పేజర్, వాకీటాకీ, స్మార్ట్ఫోన్లని చూస్తే భయపడి పోతున్నారు. అఫ్కోర్స్ వాష్రూమ్కి వెళ్లాలి అన్నా భయమే!
` పొట్లూరి పార్ధసారధి
Comments