top of page

మహేష్‌-బుచ్చిబాబు వాటే కాంబినేషన్‌!

  • Guest Writer
  • May 6
  • 3 min read

సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు తన లైనప్‌ని వేరే లెవల్‌లో సెట్‌ చేసుకొనే పనిలో ఉన్నాడు. ‘ఉప్పెన’తో తన స్టామినా అర్థమైపోయింది. ఆ వెంటనే రామ్‌ చరణ్‌కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. పెద్ది’ గ్లింప్స్‌ చూసి అంతా అవాక్కయ్యారు. గ్లింప్స్‌తోనే అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు బుచ్చి. ‘పెద్ది’ తరవాత బుచ్చి ఏం చేయబోతున్నాడు? అనే విషయంపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ‘పెద్ది’ అయ్యాక మహేష్‌ బాబుతో బుచ్చిబాబు ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కూడా సుకుమార్‌ వల్ల సెట్‌ కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ‘ఉప్పెన’ తరవాత కూడా మహేష్‌, బుచ్చి కలుసుకొన్నారు. ‘మంచి కథ ఉంటే చెప్పు, చేద్దాం’ అని మాట ఇచ్చాడట మహేష్‌. అందుకే.. మహేష్‌ కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈసారి బుచ్చి యాక్షన్‌ డ్రామా రాస్తున్నాడని, మహేష్‌ని నెక్ట్స్‌ లెవల్‌లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చి ఉన్నాడన్నది ఇన్‌సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తవ్వడానికి కనీసం మరో యేడాదైనా పడుతుంది. ‘పెద్ది’ 2026 మార్చిలో విడుదల అవుతుంది. అంటే.. రాజమౌళి సినిమా ముగిసేసరికి బుచ్చిబాబు రెడీగానే ఉంటాడు. సో.. ఈ కాంబోకి పెద్దగా అవరోధాలు ఉండకపోవొచ్చు. కాకపోతే రాజమౌళి సినిమా తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలో హీరోలు గందరగోళంలో ఉంటారు. రాజమౌళి సినిమా అంటే తప్పకుండా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే ప్రాజెక్టే. అందులో అనుమానం ఏం లేదు. అలాంటి సినిమా తరవాత మహేష్‌ ఏం చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. బుచ్చిబాబు లాంటి యువ దర్శకులతో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తే అంచనాల భారం కాస్త తగ్గుతుంది. ఓరకంగా మహేష్‌కు అది మంచి ఆలోచనే. బుచ్చిబాబు, మహేష్‌బాబు కలిస్తే మాత్రం కచ్చితంగా కాంబినేషన్‌ పరంగా ఓ క్రేజ్‌ ఏర్పడుతుంది. ఎన్టీఆర్‌తో కూడా బుచ్చిబాబు ఓ సినిమా చేయాల్సివుంది. నిజానికి ‘పెద్ది’ ఐడియా ముందుగా ఎన్టీఆర్‌కే చెప్పాడు బుచ్చిబాబు.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

బేబీ బంప్‌తో కియారా అద్వానీ!!

ఒకప్పుడు హీరోయిన్స్‌ ప్రెగ్నెంట్‌ విషయాన్ని ముందే రివీల్‌ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్స్‌ ప్రెగ్నెన్సీ విషయాన్ని వెంటనే ఓపెన్‌గా చెబుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా తమ ఆనందాన్ని షేర్‌ చేసుకుంటూ ఉన్నారు. అంతే కాకుండా హీరోయిన్స్‌ సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే రెగ్యులర్‌ ఫోటో షూట్స్‌ను షేర్‌ చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా బేబీ బంప్‌ ఫోటో షూట్స్‌ను కూడా వదలకుండా షేర్‌ చేస్తున్న హీరోయిన్స్‌ ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మలు పెళ్లి, పిల్లల తర్వాత కూడా సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంటున్నారు. ఇండస్ట్రీలో ఆఫర్లు లేకున్నా సోషల్‌ మీడియా ద్వారా వారు జనాల్లోనే ఉంటున్నారు.

తాజాగా రామ్‌ చరణ్‌తో కలిసి ఇటీవల గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేసింది. కియారా అద్వానీ ప్రెగ్నెంట్‌ అనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఇటీవల ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంది. కానీ బేబీ బంప్‌ కనిపించకుండా కాస్త జాగ్రత్తగా ఫోటో షూట్స్‌ ఇస్తూ వచ్చింది. ఈసారి ఆమె తన బేబీ బంప్‌ను హైలైట్‌ చేస్తూ మరీ ఫోటో షూట్‌కి ఫోజ్‌ లు ఇచ్చింది. రెగ్యులర్‌గా స్కిన్‌ షో ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచి, వైరల్‌ అవుతూ ఉండే కియారా అద్వానీ ఈసారి బేబీ బంప్‌ ఫోటోలతోనూ వార్తల్లో నిలవడం మాత్రమే కాకుండా వైరల్‌ అవుతోంది.

కియారా అద్వానీ తాజా ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన డిజైనర్‌ డ్రెస్‌లో కియారా అద్వానీ లుక్‌ అదిరి పోయింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, అందమైన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చే కియారా అద్వానీ బేబీ బంప్‌ తో కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. తల్లి కాబోతున్న కారణంగా కియారా అద్వానీ గత కొన్ని నెలలుగా షూటింగ్స్కు దూరంగా ఉంది. వార్‌ 2 సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కి సంబంధించిన షూటింగ్‌ ఇంకాస్త బ్యాలెన్స్‌ ఉందని తెలుస్తోంది. ఆ షూటింగ్‌కి కియారా ఎప్పుడు హాజరు అయ్యేది తెలియాల్సి ఉంది. హీరోయిన్‌గా కియారా అద్వానీ ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

బాలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్ర తో ప్రేమలో పడ్డ కియారా అద్వానీ 2023 లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల తర్వాత పిల్లల ప్లాన్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ రెండేళ్లు తిరగకుండానే కియారా అద్వానీ ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే కియారా అద్వానీ డెలివరీ ఉంటుందని, ఆ తర్వాత కేవలం రెండు నెలల్లోనే షూటింగ్‌కి కియారా అద్వానీ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. కనుక త్వరలోనే ఆమె కెమెరా ముందుకు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...


వీరమల్లు కదిలాడు!!

మే 9న ‘హరి హర వీరమల్లు’ వస్తుందని ఫ్యాన్స్‌ అంతా ఎదురు చూశారు. అయితే మరోసారి వాయిదా పడి, అందర్నీ నిరాశ పరిచింది. ‘వీరమల్లు’కు సంబంధించి మరి కొంత షూటింగ్‌ బాకీ వుంది. పవన్‌ ఖాళీ చేసుకొని, ఆ పార్ట్‌ పూర్తి చేస్తే తప్ప ఈ సినిమా బయటకు రాదు. అందుకే ‘వీరమల్లు’ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూపుల్లో పడిపోయారు ఫ్యాన్స్‌. ఇన్నాళ్లకు పవన్‌ కు మళ్లీ సినిమాలపై ఫోకస్‌ మొదలైంది. ఆయన ‘వీరమల్లు’ షూటింగ్‌ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం ప్రకటించారు. పవన్‌ సెట్లో అడుగు పెట్టారని, రెండు రోజుల షూట్‌లో పాల్గొంటారని, దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని ట్వీట్‌ చేశారు రత్నం. దాంతో ‘వీరమల్లు’కు పేకప్‌ చెప్పే సమయం ఆసన్నమైపోయింది.

త్వరలోనే ట్రైలర్‌, దాంతోపాటు మిగిలిన పాటలూ విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. జూన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రిలీజ్‌ డేట్‌పై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 80శాతం చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించారు. మిగిలిన 20 శాతం జ్యోతికృష్ణ పూర్తి చేశారు. కీరవాణి సంగీతం అందించిన సినిమా ఇది. రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో 3 పాటలు త్వరలో ఒకొక్కటిగా విడుదల చేస్తారు. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

‘వీరమల్లు’ని ఎలాగైతే పూర్తి చేశాడో అలానే ‘ఓజీ’తకి కూడా డేట్లు ఇచ్చి ఆ సినిమా కూడా ఫినిష్‌ చేయాలని పవన్‌ భావిస్తున్నాడు. దాంతో పాటుగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’కూ పవన్‌ కొన్ని డేట్లు కేటాయించే అవకాశం ఉంది.

` తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page