రెడ్ డ్రెస్లో చూపు తిప్పనివ్వని దిశా
- Guest Writer
- May 7
- 3 min read

ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో ఆఫర్లు దక్కుతాయి, కానీ హిట్స్ దక్కవని, గుర్తింపు రాదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిశా పటానీకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కడంకు కారణం ఆమె కష్టపడే తత్వం అంటారు. తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేయడం కోసం దిశా పటానీ చాలా కష్టపడుతుందని ఆమెతో వర్క్ చేసిన ఫిల్మ్ మేకర్స్ అంటూ ఉంటారు.
హీరోయిన్గా ప్రస్తుతం దిశా పటానీ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. నటిగా తనను తాను నిరూపించుకోవడం కోసం లేడీ ఓరియంటెడ్ పాత్రలకు సైతం దిశా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా దిశా పటానీ అత్యధిక ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 61.4 మిలియన్ల ఫాలోవర్స్ను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ను కలిగి ఉన్న హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. తన ఫాలోవర్స్కి రెగ్యులర్గా వినోదాన్ని పంచడం కోసం ఈమె ఇలాంటి ఫోటో షూట్స్ను షేర్ చేస్తూ ఉంటుంది.
దిశా పటానీ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించింది. సినిమాల్లో అందాల ఆరబోతతో పాటు నటనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. ఇక ఇన్స్టాగ్రామ్లోనూ అన్ని రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్లో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత కేవలం దిశా పటానీకే సాధ్యం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అందమైన దిశా పటానీ అంతకు మించి అందమైన ఫోటో షూట్స్తో అదరగొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కవ్వించే చూపులతో అదరగొడుతున్న దిశా పటానీ ఈ ఫోటో షూట్తో ఫాలోవర్స్ సంఖ్య మరింతగా పెంచుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలుగులో ఈ అమ్మడు ప్రభాస్కి జోడీగా కల్కి 2898 ఏడీ సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో దిశా పటానీ లుక్తో పాటు బాడీ లాంగ్వేజ్తోనూ ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్లోనూ ఈమెకు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈమె గత ఏడాది తమిళ్ మూవీ కంగువాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో మరోసారి కోలీవుడ్ మూవీలో ఈమె నటించేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్లో మాత్రం ఈమె ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి హిందీలో ఈమె రెండు మూడు సినిమాలు చేస్తోంది.
రివ్యూలు తరవాత.. ముందు పైరసీ ఆపండి!!
చిత్రసీమకు రివ్యూల వల్లే నాశనం అయిపోతోందని వాపోయే నిర్మాతలు, దర్శకులు ఎంతోమంది. థియేటర్లకు జనం రాకపోవడానికీ, వసూళ్లు తగ్గడానికీ, థియేటర్లు గత వైభవం కోల్పో వడానికీ కారణం.. ఇదేనంటూ రివ్యూల్ని కార్నర్ చేస్తుంటారు. నిజానికి రివ్యూల వల్ల సినిమాలు ఆడవు.. ఆగవు. దాని కంటే ఎక్కువ నష్టం పైరసీ వల్ల జరుగుతోందన్నది కాదనలేని నిజం. ఈ విషయం నిర్మాతలకూ తెలుసు. హిట్ 3 రిలీజ్ రోజునే హెచ్డీ ప్రింట్ పైరసీ సైట్లలో దర్శ నమిచ్చింది. ఆ క్వాలిటీ చూస్తే మతి పోతుంది. ఇంట్లో ఖరీదైన టీవీలూ, సౌండ్ సిస్టమ్స్ ఉంటే థియేటర్లో చూసిన ఫీలింగ్కి ఏమాత్రం తీసిపోదు. ‘హిట్ 3’ అనే కాదు. అదే రోజు విడుదలైన రెట్రో సినిమా పైరసీ వెర్షన్ కూడా సేమ్ క్వాలిటీలో దిగి పోయింది. శని, ఆది వారాలు ‘హిట్ 3’ వసూ ళ్లు బాగున్నాయి. కానీ ఇంకా బాగుండాల్సింది. ఈ రెండిరటి మధ్య తేడా ‘పైరసీ’. కనీ సం వసూళ్లలో 10 శాతం ఈ పైరసీ వల్ల నష్టపోవాల్సివస్తోంది నిర్మా తలు. ఇది వరకు కూడా పైరసీ బెడద ఉండేది. కానీ హెచ్డీ క్వాలి టీ ప్రింట్ రావడానికి టైమ్ పట్టేది. ఇప్పుడు కొన్ని గంటల్లో బయటకు వచ్చే స్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? అనేది పెద్ద డిబేట్. కానీ వచ్చినప్పుడు దాన్ని అరిగట్టే వ్యవస్థ లేకపోవడం ప్రధానమైన లోపం. ఇది కేవలం తెలుగు చిత్రసీమని పట్టిపీడి స్తున్న వ్యవహారం మాత్రమే కాదు. అన్ని చోట్లా వుంది. చిత్రసీమలో యేడాదికి వేల కోట్ల టర్నొవర్ జరుగుతోంది. పెద్ద పెద్ద సినిమాలు తయారవుతు న్నాయి. వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే అది విడుదలైన గంటల్లోనే పైరసీకి గురి కావడం ఆందోళన కలిగించే వ్యవహారం. ముందు.. దీనిపై పరిశ్రమలన్నీ ఏకమై నిర్ణయం తీసుకో వాల్సిన అవసరం ఉంది. వాళ్లు పోరాడితే ముందుగా పైరసీ పై పోరాడాలి. ఆ తరవాత మిగిలి న అంశాలపై దృష్టి పెట్టాలి. చిత్రసీమ వల్ల ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం వస్తోంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాత లూ ఏటా వందల కోట్లు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. వినోదపు పన్ను పేరుతో ప్రతీ టికెట్ పై కొంత మొత్తం ప్రభుత్వానికి వెళ్తోంది. టూరిజం బాగుపడుతోంది. షూటింగ్ పర్మిట్ల పేరుతో ఆదాయం వస్తోంది. ఇలా ఎలా చూసినా చిత్రసీమ వల్ల ప్రభుత్వానికి డబ్బే. కానీ.. చిత్ర సీమ గురించి ప్రభుత్వాలు పట్టించుకొంటున్నాయా? అనేది పెద్ద ప్రశ్న. ‘మాకు భూములు ఇవ్వండి.. అవార్డులు ఇవ్వండి.. రాయితీలు ఇవ్వండి’ అని అడిగే బదులు పైరసీని ఆపండి అని మూకుమ్మడిగా ప్రభుత్వాల్ని నిలదీస్తే తప్ప పనులు జరగవు. చిత్రసీమని ఏకం చేసే శక్తి ఇప్పుడు కావాలి. ఎవరి సినిమా విడుదలైనప్పుడు వాళ్లు ముందుకొచ్చి గొంతు చించుకోవడం తప్ప.. కలిసికట్టుగా పోరాడేతత్వం ఇంకా అల వాటు చేసుకోలేకపోతున్నారు. ఈ వైఖరి మారాలి. దేశంలోని అగ్ర నిర్మాతలు, దర్శకులు అంతా ఏకమై.. కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకొని, పైరసీ భూతాన్ని అంతమొందించే చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలి. కానీ ఇదంతా జరిగే వ్యవహారమేనా? పరిశ్రమ అందర్నీ ఏకం చేయాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. మరి ఆ బాధ్యత ఎవరు తీసుకొంటారు? ఇప్పుడైనా మేల్కోనకపోతే.. చిత్రసీమ మనుగడ రానున్న రోజుల్లో మరింత దుర్భర మయ్యే ప్రమాదం పొంచి వుంది.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
Comments