సైనిక దళాలకు స్వేచ్ఛా.. అంటే ఏమిటి?!
- DV RAMANA
- May 6
- 2 min read

భారత-పాక్ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. బలగాలు ఏం చేస్తున్నాయో, ఎలా ఉన్నాయో తెలియదు గానీ టీవీ ఛానళ్లు మాత్రం ఊగిపోతున్నాయి. కొన్నయితే యుద్ధాన్ని కూడా ప్రారంభించేశాయి. ఉగ్రదాడికి పాల్పడినవారిపై పగతీర్చుకోవాలని దేశమంతా కోరు తోంది. ఈ నేపథ్యంలో ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉగ్రమూకలను, వారిని ప్రోత్సహించిన వారిని శిక్షించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను భద్రతా దళాలకే ప్రధాని మోదీ అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. గతంలో పుల్వామా దాడి జరిగిన రెండు రోజులకే ప్రధాని ఇదే తరహా నిర్ణయాన్ని ప్రక టించారు. ఇప్పుడు మాత్రం వారం రోజుల వ్యవధి తీసుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిం దేమిటి? అసలు మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ అంటే ఏమిటి? పాకిస్తాన్పై నరేంద్రమోదీ యుద్ధం ప్రకటించనున్నట్లు దేశమంతా భావిస్తుంటే మీడియా మాత్రం యుద్ధం ప్రారంభమైనట్లే చిత్రిస్తు న్నది. కానీ నాడు బాలాకోట్పై మెరుపుదాడి చేసిన మన బలగాలు, ఇప్పుడేం చేస్తాయో తెలి యదు. మన వైరిపక్షం పాకిస్తాన్ పైకి ఏం చెప్పినప్పటికీ మిలిటరీ చెప్పినట్లు అక్కడి ప్రభుత్వాలు వినాల్సిందే. లేకపోతే ప్రధానులే జైలుపాలవుతారు. కానీ మనదేశంలో అలా కాదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిలిటరీ వ్యవహరించాలే తప్ప.. తనంతట తాను నిర్ణయాలు తీసుకోవటానికి లేదు. కానీ ఇప్పుడు మిలిటరీకి మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారని మీడియా ఊదరగొడుతోంది. కానీ దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తీర్మానించడం వంటి జరిగిన దాఖలాల్లేవు. అసలు అంత సమయం ఎక్కడుంది, అది అవసరమా అని ప్రశ్నించవచ్చు. కానీ అదే సమయంలో మోదీ బీహార్ వెళ్లి ఒక సభలో పాల్గొన్న విషయం మర్చిపోకూడదు. పహల్గాం దాడి ఏప్రిల్ 22న జరిగితే.. ప్రధాని 29న ప్రకటన చేశారు. పార్లమెంటును సమావేశపర్చడానికి ఈ వారం రోజులు చాలవా? యావత్ దేశాన్ని కుదిపేసిన ఉదంతం గురించి ప్రజాప్రతినిధుల సభలో చర్చించని ప్రజాస్వామ్య దేశం ఇంకెక్కడైనా ఉందా? కానీ నిర్ణయం కంటే పూర్తి స్వేచ్ఛ అనే ప్రచారానికే మోదీ ప్రాధాన్యత ఇచ్చారు. సరిహద్దు బలగాల విధి నిర్వహణలో నిఘా ఒకటి. అం దులో వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే పహల్గాంలో అమాయకులు బలయ్యారు. సరిహద్దులకు రెండువైపులా ఉన్న వారిపై చర్యలకు సైనిక దళాలకు స్వేచ్ఛ ఇచ్చినట్లు మాత్రమే మోదీ చెప్పారే తప్ప దాని కోసం యుద్ధం చేయాలని చెప్పలేదు. శత్రు సైనికులు సరిహద్దులో దాడులకు తెగబ డితే తిప్పికొట్టాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే యుద్ధాలకు మిలిటరీకి అనుమతి ఉండదు. అవసరమని మిలిటరీ సిఫార్సు చేస్తే మంత్రివర్గం, పార్లమెంటు నిర్ణయించాల్సి ఉం టుంది. మిలిటరీకి అలాంటి విచక్షణ అధికారాలు ఇస్తే ఏం జరుగుతోందో అనేక దేశాల్లో చూస్తు న్నాం. కాశ్మీరుకు ఆర్టికల్ 370.. అదే విధంగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలనిచ్చే చట్టాన్ని (ఏఎఫ్ఎస్పిఏ) సవరిస్తామని వాగ్దానం చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ భద్రతా దళాలకు ముప్పు తలపెట్టే కుట్ర పన్నిందని, జమ్మూకాశ్మీరుతోపాటు ఇతర ఉగ్రవాదులున్న ప్రాంతాల్లో భద్రతా దళాల చేతులు కట్టివేసిందని 2019 ఏప్రిల్ మూడో తేదీన పశ్చిమబెంగాల్లోని సిలిగురి ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కానీ ఆ ఎన్నికల్లో రెండోసారి గెలిచి మళ్లీ పదవి చేపట్టిన మోదీ ఆర్టికల్ 370 రద్దుతో పాటు కాశ్మీరు రాష్ట్రాన్నే రెండుగా చీల్చి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేశారు. ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యత కేంద్రానిదే. భద్రతా దళాలకు పూర్తి అధికా రాలు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. అయినప్పటికీ గత ఐదేళ్లలో ఉగ్రవాదులు పహల్గాం కాకుండా కశ్మీర్లో 60 మందికి పైగా పౌరులను చంపారు. మరి కేంద్రం ఎందుకు విఫలమై నట్లు? తాజా దాడికి బాధ్యత ఎవరిది? మోదీ చెప్పిన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా! 2019 ఆగస్టు ఎనిమిదిన ఆర్టికల్ 370 రద్దు గురించి టీవీలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఆర్టికల్ను ఒక సాధనంగా చేసుకుని భయాన్ని వ్యాప్తి చేసి కాశ్మీరు అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 370, 35ఏ వేర్పాటువాదాన్ని ఇచ్చినం దునే వాటిని రద్దు చేశామన్నారు. ఇప్పుడు అవేవీ లేవు.. మరి ఉగ్రవాదుల ముప్పు తప్పిందా? అంటే లేదని పహల్గాం దాడి వెక్కిరించి మరీ చెబుతుంది.
Comments