top of page

పోస్టర్‌ లేకుండా సైకాలజీ.. జక్కన్న మైండ్‌గేమ్‌తో ఇండస్ట్రీ షాక్‌!

  • Guest Writer
  • Nov 13, 2025
  • 2 min read

తెలుగు సినిమాకు కొత్త దారులు చూపించిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మళ్లీ తన మాస్టర్‌ మైండ్‌ను ప్రూవ్‌ చేశాడు. ఈసారి అది సినిమా టెక్నిక్స్‌లో కాదు. పబ్లిసిటీ గేమ్‌లో! సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో చేస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ`29 ప్రాజెక్ట్‌ చుట్టూ రాజమౌళి వేసిన ప్రతి అడుగు ఇప్పుడు టాలీవుడ్‌ మొత్తాన్నీ షాక్‌లోకి నెట్టింది. పోస్టర్లు లేకుండా, ప్రోమోలు లేకుండా, ఒక్క హింట్‌ కూడా ఇవ్వకుండా జక్కన్న స్టైల్‌లో సైలెంట్‌ మార్కెటింగ్‌ చేస్తూ ఫ్యాన్స్‌లో కుతూహలాన్ని పీక్స్‌కి చేర్చేశారు. ‘‘సంచారి’’ సాంగ్‌ నుంచి ‘‘ఓటీటీ ఈవెంట్‌’’ వరకు, ప్రతి నిర్ణయం సరికొత్త మార్కెటింగ్‌ పాఠం నేర్పుతోంది. ‘‘మిస్టరీ ఈజ్‌ ద న్యూ హైప్‌.’’ అనే యాంగిల్‌లో చేస్తున్న ఈ ప్రమోషన్స్‌ వెనక ఉన్న స్ట్రాటజీని చూద్దాం.

భారతీయ సినిమా ఇప్పుడు ఒకే పేరు చుట్టూ తిరుగుతోంది.. రాజమౌళి. అలాగే సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు అంటే క్లాస్‌ G మాస్‌ కలిసిన బ్రాండ్‌. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసినప్పుడు, అది కేవలం సినిమా కాదు.. ఒక గ్లోబల్‌ ఈవెంట్‌. ఎస్‌ఎస్‌ఎంబీ`29 అనే ప్రాజెక్ట్‌ గురించి ఒక్క పోస్టర్‌ కూడా రాకముందే, ప్రపంచ సినిమా వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కానీ ఈసారి రాజమౌళి చూపిస్తున్న రూట్‌ పబ్లిసిటీ కంటే లోతైనది. అది ఒక మార్కెటింగ్‌ ఫిలాసఫీ. పబ్లిసిటీ కాదు.. పబ్లిసిటీ పై ‘‘పాఠం’’!

ప్రతి హీరో సినిమా కోసం యూట్యూబ్‌ టీజర్లు, ప్రోమోలు, పోస్టర్లు, కౌంట్‌డౌన్‌లు సాధారణం అయిపోయాయి. అవి హడావుడి ఇస్తాయి కానీ మిస్టరీని తీసేస్తాయి. కానీ రాజమౌళి మాత్రం దీన్ని పూర్తి రివర్స్‌ చేశారు. హడావిడి తగ్గించి, హంగామా పెంచాడు. అప్‌డేట్‌ రాకముందు బజ్‌సైలెంట్‌, తర్వాత ఎక్స్‌ప్లోషన్‌. ఇదే ఆయన మాస్టర్‌ప్లాన్‌. సినిమా ప్రొమోషన్‌ని ఆయన ఒక కంటెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చేశాడు. అంటే ‘‘ప్రజలు అప్‌డేట్‌ కోసం వెతకకూడదు, అప్‌డేట్‌ వాళ్లను చేరుకోవాలి.’’

‘‘పోస్టర్‌ రాబోతోంది’’ అనే కాలం పోయింది! ఒక్క అప్‌డేట్‌ ఇచ్చే ముందు పది పోస్టర్లు వదులి క్యూరియాసిటీ చంపేస్తున్నారు. ‘‘ఫస్ట్‌లుక్‌ సూన్‌.., ప్రోమో ఆన్‌ ద వే.., టీజర్‌ కమింగ్‌ దిస్‌ వీక్‌’’.. ఇవన్నీ సోషల్‌ మీడియాలో రొటీన్‌ అయిపోయాయి. కానీ రాజమౌళి గేమ్‌ ప్లాన్‌? ఏ హడావిడి లేదు. ఏ ప్రీ-అలర్ట్‌ లేదు. డైరెక్ట్‌ బాంబ్‌ డ్రాప్‌! అదే ఎస్‌ఎస్‌ఎంబీ`29 స్పెషల్‌. ‘‘సంచారి’’ సాంగ్‌ డ్రాప్‌.. జక్కన్న మాస్టర్‌ స్ట్రోక్‌! ఇండస్ట్రీకి షాక్‌ ఇచ్చేలా ‘సంచారి’ సాంగ్‌ నిన్న ఆకస్మికంగా విడుదలైంది. ఎవరికి ముందుగా హింట్‌ లేదు, ఎలాంటి పోస్టర్‌ లేదు, ప్రోమో లేదు. సడన్‌గా యాపిల్‌ మ్యూజిక్‌లో డ్రాప్‌ అయి, ఆ తర్వాత యూట్యూబ్‌లో దుమ్ము రేపింది!

ఫలితం? పోస్టర్‌ కంటే పెద్ద రీచ్‌! సాంగ్‌ కంటే పెద్ద సర్‌ప్రైజ్‌! జక్కన్న స్టైల్‌లో ‘‘హైప్‌ కన్నా కంటెంట్‌’’ అనే మంత్రం మళ్లీ వర్క్‌ అయిపోయింది. 15న ఈవెంట్‌%ౌ% కానీ ఈ సారి టీవీలో కాదు! మహేష్‌ బాబు సినిమా అంటే అన్ని ఛానల్స్‌ లైవ్‌ చేస్తాయి. కానీ ఈ సారి రాజమౌళి డెసిషన్‌ షాక్‌! ఈవెంట్‌ టీవీ లేదా యూట్యూబ్‌లో కాదు. ఎక్స్‌క్లూజివ్‌గా జియో Ê హాట్‌స్టార్‌లో మాత్రమే స్ట్రీమ్‌! ఇది ఇండియన్‌ సినిమా మార్కెటింగ్‌కి కొత్త ఎడిషన్‌. అన్నట్లు ‘‘ఈవెంట్‌ కూడా ఓ బ్లాక్‌బస్టర్‌ కావాలి!’’ అన్నట్టే జక్కన్న ప్లాన్‌!

ఇది కేవలం బిజినెస్‌ కాదు, ఒక ఎకోసిస్టమ్‌ షిఫ్ట్‌. సినిమా ఈవెంట్స్‌ కూడా ఇప్పుడు ‘‘కంటెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌’’ అయిపోతున్నాయని రాజమౌళి నిరూపిస్తున్నారు.

జక్కన్న మైండ్‌గేమ్‌ - పబ్లిసిటీని ఆర్ట్‌గా మార్చేశాడు!

రాజమౌళి దగ్గర పబ్లిసిటీ అంటే హడావిడి కాదు. హుక్‌! ప్రతి అప్‌డేట్‌ ఒక్కసారిగా పడుతుంది. ఆ తర్వాత సోషల్‌ మీడియా పూనకం మొదలవుతుంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కూడా ఇదే ప్యాటర్న్‌ కొనసాగిస్తూ ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎంబీ`29తో సైలెంట్‌ స్ట్రాటజీ, సౌండ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తున్నాడు.

పబ్లిసిటీ ఎకనామిక్స్‌: రాజమౌళి స్ట్రాటజీ వెనక సైన్స్‌

ఇండస్ట్రీలో పబ్లిసిటీకి కోట్లలో ఖర్చు చేస్తారు. కానీ అవే సైకిల్‌ రిపీట్‌ ` ట్రైలర్‌, పాట, ప్రోమో, ఫుల్‌ సాంగ్‌, టీజర్‌, ఫుల్‌ ట్రైలర్‌. కానీ రాజమౌళి పబ్లిసిటీని ‘‘హ్యూమన్‌ క్యూరియాసిటీ’’ మీద బిల్డ్‌ చేస్తున్నారు. అందుకే ఆయన మహేష్‌ సినిమాకి అప్‌డేట్‌ ఇవ్వరు, అంచనా పెడతారు. పోస్టర్‌ చూపించరు, ఊహ చూపిస్తారు. పాట ప్రమోట్‌ చేయరు, సడన్‌గా డ్రాప్‌ చేస్తారు. ఇది మార్కెటింగ్‌ కాదు. సైకాలజీ.

మహేష్‌ బాబు ఎలిమెంట్‌: స్టార్‌ కాదు, సింబల్‌!

మహేష్‌ బాబు సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించడం అంటే కేవలం ఫ్యాన్స్‌ ఫ్రెంజీ కాదు, సైలెంట్‌ స్టార్డమ్‌. ఆయన దగ్గర ఓవర్‌ ప్రొమోషన్‌ అవసరం లేదు. రాజమౌళి ఈ సైలెన్స్‌ని ఎక్స్‌ప్లాయిట్‌ చేస్తున్నారు. అంటే, మహేష్‌ ప్రెజెన్స్‌నే పబ్లిసిటీగా మార్చేశారు. గ్లింప్స్‌ రాకముందే దేశం మొత్తం హడావిడి ు అదే ఆయన స్క్రిప్ట్‌ కాదు, స్ట్రాటజీ!

రాజమౌళి ఫిలాసఫీ:

‘‘ప్రచారం కాదు.. ప్రజల్లో ఉత్సుకత రేపడం ముఖ్యం.’’

ఇది బాహుబలి టైమ్‌లో వర్క్‌ అయింది, ఆర్‌ఆర్‌ఆర్‌ టైమ్‌లో పీక్స్‌కి చేరింది, ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎంబీ`29తో అది గ్లోబల్‌ ప్రమోషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ అవుతోంది. అందుకే ‘‘అన్నీ సైలెంట్‌గా జరుగుతున్నాయి. కానీ ఎఫెక్ట్‌ థండర్‌లా ఉంది!’’ రాజమౌళి ఫాలో చేయడు. ఫార్ములాలను బ్రేక్‌ చేస్తాడు! ఎస్‌ఎస్‌ఎంబీ 29 పబ్లిసిటీ కూడా అదే ప్రూఫ్‌. ఇక నవంబర్‌ 15 ఈవెంట్‌ తర్వాత, ఈ మ్యాన్‌ మళ్లీ కొత్త పాఠం నేర్పబోతున్నాడు ఇండియన్‌ సినిమాకు!

- జోశ్యుల సూర్యప్రకాశ్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page