top of page


నకిలీ పాస్ల కేసులో ఆరుగురిపై FIR
శుక్రవారం వన్టౌన్లో మొదలైన ప్రాథమిక విచారణ ప్రింటింగ్కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం ‘పాస్లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్లు ఎన్ని ముద్రించారు? ఎం
Prasad Satyam
Apr 171 min read


రక్తనిధిలో ధనదాహం
సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్బ్యాంక్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది వైద్యులకు కమీషన్లు.. ప్లేట్లెట్లలో కల్తీలు పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరం
Prasad Satyam
Apr 144 min read


భూమి మీదే.. డాక్యుమెంట్లే మావి!
చనిపోయినవారి పేరుతో పాస్బుక్ల సృ ష్టి నాయకులకే దిక్కులేదు.. సామాన్యుల పరిస్థితేమిటినే ప్రశ్న నకిలీ పత్రాలతో మాయాజాలం విలువైన స్థలంపై కన్ను కటకటాల్లోకి కిలాడీ గ్యాంగ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగు సతీష్కుమార్.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. మామిడి జగన్నాధరావు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. బొత్స గోవిందరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. కోడూరు విజయ్కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాట్ల గోపాలకష్ణంరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. అర్జి అప్పలరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాప
Prasad Satyam
Apr 103 min read


పలాసలో సినీఫక్కీలో దోపిడీ
జీఎస్టీ అధికారులమంటూ చొరబడిని ఎనిమిదిమంది యజమానికి బేడీలు వేసి 750 గ్రామలు బంగారం అపహరణ వెంకటేశ్వర జ్యూయలరీలో చోరీ రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్టీమ్ (సత్యంన్యూస్, పలాస) పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే భగవతి థియేటర్ రోడ్డులోని నిత్యానందనగర్ శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్లో పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు సినీ ఫక్కీలో బంగారం దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారులో వచ్చిన నలుగురు జీఎస్టీ అధికారులమంటూ యజమాని కిల్లంశెట్టి రామ కృష్ణ కు పరిచయం చేసు

BAGADI NARAYANARAO
Apr 71 min read


హ్యాట్సాఫ్ రేవతి..!
హెడ్ కానిస్టేబుల్ రేవతి.. సాత్తాన్కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షి. ఒక సందర్భంలో మనస్సాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతి. సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి.. ఇవే ప్రధాన లక్ష్
Guest Writer
Apr 71 min read


మంత్రి పేరుతో చిల్లర పనులు
హైదరాబాద్ యువతి నుంచి సొమ్ములు వేయించుకున్న నకిలీ నాయకుడు టెక్కలికి చెందిన తరుణ్గా గుర్తించిన టీడీపీ వర్గాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ఒక ఫేక్ ఐడీని ఫేస్బుక్లో క్రియేట్ చేసి, హైదరాబాద్కు చెందిన ఒక యువతిని ఆర్థికంగా మోసం చేసిన కేసును ప్రాథమికంగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్రమంత్రి కార్యాలయం గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్థిరపడి, ఒక పని కోసం రామ్మోహన్ నాయుడుకు సోషల్ మీడియాలో ఫిర
Prasad Satyam
Mar 241 min read


కలెక్షన్ సీట్ల కోసం జిల్లా ట్రెజరీలో గలాట
పోలీస్ స్టేషన్లో డీడీ, ఉద్యోగులు పరస్పరం ఫిర్యాదులు కౌన్సిలింగ్తో పంచాయితీని చక్కదిద్దిన సీఐ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంగా దండిగా సొమ్ములు వచ్చే ఏ1, ఏ2 పోస్టుల కోసం ఆ శాఖ డీడీ రవికుమార్, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. గత కొన్ని రోజులుగా కార్యాలయంలో ఈ రెండు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సీట్ల మార్పుల విషయంలో డీడీ, కార్యాలయ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. డీడీ తనకు నిచ్చిన ఇద్దరిని ఆ

BAGADI NARAYANARAO
Mar 232 min read


స్వల్ప వివాదం.. తీసింది ప్రాణం!
మేనల్లుడిని మందలించిన యువకుడు తమనెందుకు నిందించావని మరొకడి నిలదీత ఇద్దరి మధ్య వాదులాట, తోపులాట కిందపడి మరణించిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి గంజాయి, మద్యం బానిసల ఆగడాలేనని ఆరోపణలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్వల్ప వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరం మొదలైన గొడవ తోపులా{కు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మండలవీధికి చెందిన గొర్లె మోహనరావ

BAGADI NARAYANARAO
Mar 202 min read


గాయత్రీ... హతవిధీ!
నెలల క్రితమే బయటపడ్డ మార్ఫింగ్ జాడ విద్యార్థినులను భయపెట్టి తొక్కిపెట్టే కుట్ర ‘సత్యం’ కథనం, పేరెంట్స్ ఒత్తిడితో ఫిర్యాదు నాటి స్ఫూర్తికి భిన్నంగా నడుస్తుందన్న అనుమానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “స్వామినాయుడు, అంబటి రంగారావు, పులఖండం శ్రీనివాసరావు, విష్ణుమూర్తి వంటి విద్యావేత్తలు, ఉన్నత ఆలోచనాపరుల కనుసన్నల్లో నడిచిన విద్యాసంస్థ అది. మాలాంటి వారికి వారంతా ఒక దిక్సూచి లాంటివారు. గురజాడ సంస్థ జిల్లాకు ఒక బ్రాండ్. గాయత్రీ హÃమాలకు, యువజనోత్సవాలకు అదో వేదిక. కానీ ఈరోజు ఆ స

BAGADI NARAYANARAO
Mar 133 min read


‘గురజాడ’లో అశ్లీల మార్ఫింగ్ జాడ
మహిళా అధ్యాపకులే ప్రథమ బాధితులు డిగ్రీ విద్యార్థినుల ఫొటోలకూ అదే గతి నిందితులకు టీసీ ఇచ్చామంటున్న మేనేజ్మెంట్ అసభ్య డేటా అమ్మేశారంటున్న తల్లిదండ్రులు మార్ఫింగ్కు సహకరించిన తోటి విద్యార్థిని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లకుండా బంధిఖానా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మహాకవి గురజాడ అడుగుజాడల్లో చదువు చెబుతామంటూ నెలకొల్పిన సొసైటీ అది.. చదువుల తల్లి గాయత్రీదేవి పేరుతో నడుస్తున్న కార్పొరేట్ కాని కార్పొరేట్ సంస్థ అది.. ఊరికి దూరంగా మునసబుపేటలో ప్రత్యేక

BAGADI NARAYANARAO
Mar 122 min read


నకిలీ బీమా!
చావుకు చేరవైనవారే వారి పెట్టుబడి వారి పేరుతో తప్పుడు పత్రాలు సృ ష్టించి పాలసీలు చనిపోయాక కుటుంబ సభ్యులతో క్లెయిమ్స్ దాఖలు పరిహారం అందాక వారికి కొంత ఇచ్చి.. మిగతాది స్వాహా ఇందులో తొమ్మిది బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం జిల్లా ఎస్పీతోపాటు ఐఆర్డీఏఐకి ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వంజంగి గ్రామానికి చెందిన బెండి మహాలక్ష్మి తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుంది. తీసుకున్న ఏడాదిలోనే మతి చెందింది. దాంతో ఆ పాలసీలకు సంబంధించి రూ.1.40 కోట్ల బీమా పరిహారం చెల్లి

BAGADI NARAYANARAO
Feb 193 min read


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
Feb 93 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA
Feb 62 min read


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read


క్రైమ్ రేట్ గట్టిగా తగ్గింది..!
ఏడాదిలో 10కి పెరిగిన హత్యలు చోరీ సోత్తు 91 శాతం రికవరీ తగ్గిన మిస్సింగ్ కేసులు.. పెరిగిన పోక్సో నేరాలు గంజాయిపై ఉక్కుపాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసుశాఖ విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ ఫ్లయింగ్, సోషల్ మీడియా మోనటరింగ్ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది నేరాల నమోదు, జరిగ

BAGADI NARAYANARAO
Dec 30, 20253 min read


ముడుపు కట్టు.. సరుకు పట్టు!
ఎచ్చెర్ల ప్రభుత్వ మద్యం గొడౌన్లో దందా మాజీ ఉద్యోగి మంత్రాంగంతో వసూళ్ల పర్వం కేసుకు రూ.10 అదనంగా ఇస్తే కావలసినంత సరుకు ఇండెంట్ విడిపించుకున్న ప్రతిసారీ రూ.350 కట్టాల్సిందే (file photo) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్న సామెత ఉంది. ఇది వాస్తవమేనని నిరూపించే కథనమిది. ఒక అధికారి తన సర్వీసులో మూడొంతుల కాలాన్ని నాన్ఫోకల్ ఏరియాల్లోనే పని చేశారు. ఫోకల్ ఏరియాల్లో పని చేసే అవకాశాలు రాక కాదు.. అవినీతికి మారుపేరైన తన శాఖలో దండటం, పంచడం ఇష్టంలేక తెర వ

NVS PRASAD
Dec 20, 20253 min read


నడిరోడ్డు మీద అరాచకం
పట్టపగలే ప్రాణాలు పోయేటట్టు కొట్టారు ఒడిశా నుంచి బిర్యానీ సెంటర్ పేరుతో వచ్చి రౌడీయిజం రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు బాధితులు స్థానికంగా కుట్లు వేయించుకుని ఫిర్యాదుకు దూరంగా ఉన్న మరో బాధితుడు పరారీలో నిందితులు కిన్నెర జంక్షన్ వద్ద ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బతుకుతెరువు కోసం ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చి ఇక్కడ రెండు బిర్యానీ పాయింట్లు ఏడాది క్రితం ప్రారంభించి రెండు
Prasad Satyam
Dec 16, 20252 min read


అక్రమాల గుంతల్లో ప్రాణాలే గల్లంతు!
ఇసుక కోసం నదిలో యథేచ్ఛగా తవ్వకాలు ఆ గోతులతో నిరంతరం ప్రమాదాలు బైరిలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి ఆ వాహనానికి అనుమతి లేదు.. మృతుడికి లైసెన్సూ లేదు ఘటనను కప్పిపుచ్చేందుకు రాజీ యత్నాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నాగావళి నదిలో భైరి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసులోనూ బహుశా ఇదే కారణం పేర్కొని ఉంటారు. అందులో తప్పులేదు కూడా. కానీ ఈ మరణానికి అసలు కారణం ఏమటిన్నది పరిశీలిస్తే

BAGADI NARAYANARAO
Dec 15, 20252 min read


బలి కోరుతున్నబహుముఖ ప్రేమ!
వరుసగా రెండు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం సృజన్ను హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారన్న ఆరోపణలు లోకేష్ది ఏకంగా హత్యేనన్న అనుమానాలు `స్వాతి విషయంలోనూ ఏం జరిగిందో తెలియాలంటున్న కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో బీటెక్ విద్యార్థి పత్తిపాటి సృజన్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్యాంపస్లో ప్రతి ఏటా ఒకరిద్దరు ఇదే పని చేస్తుండటంతో రొటీన్గానే ఈ కేసును ముగించేయాలని అటు యాజమాన్యం, ఇటు పోలీసులు భావించారు. కానీ గుంటూరు నుంచి వచ్చిన సృజన్ కుటుంబీకు
Prasad Satyam
Dec 10, 20253 min read


సోంపేటలో భారీ చోరీ
30 తులాల బంగార0 బీరువా నుంచి మాయం (సత్యంన్యూస్, సోంపేట) సోంపేట కోర్టుపేటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న తంగుడు మనోజ్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి దొంగలు పడి 30 తులాల బంగారాన్ని, లక్ష రూపాయలు పైగా నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సోంపేటలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ ఆదివారం సోంపేటలో ఓ ఫంక్షన్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భార్యతో కలిసి బరంపురంలో మరో ఫంక్షన్కు వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా ఇచ్ఛాపురం హైవే వద్ద మరో వ్యక్
Prasad Satyam
Dec 8, 20252 min read
bottom of page


