top of page


విలీన చిక్కుముడికి సరికొత్త విరుగుడు!
వివాద పరిష్కారం దిశగా ప్రతిపాదనలు అభివృద్ది చెందిన ప్రాంతాలను అలాగే ఉంచడం.. గ్రామీణ వాతావరణం ఉన్న వాటిని పంచాయతీలు చేయడం బాధిత పంచాయతీల ప్రతినిధుల వినూత్న ఆలోచన ఎమ్మెల్యే శంకర్ ప్రయత్నాలకు ఊతమిచ్చే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘కావాలంటే రికార్డు చేసుకోండి.. ఈ ఏడాది జులై నాటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించి తీరుతాం’.. అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో విలేకరులకు ఎమ్మెల్యే గొండు శంకర్ నొక్కి వక్కాణించారు. ఆ గడువుకు మరో నెల రోజుల సమయమే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో ఎన
Prasad Satyam
9 hours ago3 min read


మీరు కట్టుకోండి..మేం మూసుకుంటాం..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ మున్సిపాలిటీలోనైనా ప్రభుత్వ కాలువకు, రోడ్డుకు నాలుగు అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాలి. శ్రీకాకుళంలో మాత్రం ఓ ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. ఇల్లు నిర్మించుకుంటాం, ప్లాన్ ఇవ్వండి అని అడిగితే, సెంటున్నర స్థలానికి సెంటుముప్పావు వదిలేసి కట్టాలని బుర్ర లేని తీర్పు ఒకటిస్తారు. అలా కాకుండా మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ అధికారులకు సొమ్ములిచ్చి మేం కట్టుకుంటాం.. మూసుకోండి అంటే మాత్రం కళ్లే కాదు.. అన్ని రంధ్రాల్లోనూ సీసం పోసుకుని మరీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషి
SATYAM DAILY
10 hours ago1 min read


అం‘తరాల’ వెక్కిరింతలెందుకు?
మా కాలమే ఎంతో హాయిగా ఉండేది. అంతా కలుపుగోలుగా ఉండేవాళ్లం, ఏ సౌకర్యాలు లేకపోయినా పరస్పరం సహకరించుకునేవాళ్లం.. ఇప్పుడెన్ని సౌకర్యాలు వచ్చినా ఎవరికివారే యమునాతీరే.. ఒంటరి బతుకులే’.. పెద్దవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తరచూ వారి నుంచి వినిపించే మాటలివే. పాత తరం బతుకుల ముందు ఇప్పటి జీవితాలు ఎందుకూ పనికిరావన్నట్లు వ్యాఖ్యనిస్తుంటారు. ‘ఆ రోజులే వేరు.. మళ్లీ ఆ కాలానికి వెళ్లిపోవాలని ఉందంటూ’ ఈమధ్య సోషల్ మాడియాలో కూడా చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. మరికొందరు ఇంకా ముందుకెళ్లి జనరేషన్ జెడ్

DV RAMANA
10 hours ago3 min read


బాలల మెదళ్లకు ‘సెల్ ’ చెదలు!
పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కబళిస్తున్న మొబైల్ వేసవిలో అడాలసెంట్ సైకియాట్రీ కేంద్రానికి కేసుల తాకిడి విశాఖ మానసిక ఆస్పత్రిలో ఐదు నెలల్లో 640 నమోదు సెల్ బానిసత్వం వర్చువల్ ఆటిజానికి దారితీసే ప్రమాదం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) వేసవి సెలవులు అనగానే గతంలో పిల్లలు స్వగ్రామాల్లో ఉండే అమ్మమ్మ, తాతయ్యల వద్దకు వెళ్లి పల్లెపట్టుల్లో ఆటపాటల్లో నిమగ్నమయ్యేవారు. కాలం మారిన తర్వాత ఆ సంప్రదాయాన్ని కాస్త వెనక్కినెట్టి తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలు చేయడం అలవాటుగా మారింది.

DV RAMANA
2 days ago3 min read


అవినీతిని ప్రశ్నిస్తే ‘భరోసా’ కట్!
మత్స్యకారుడిపై అధికారుల జులుం బోట్లను హోల్డ్లో పెట్టి కక్షసాధింపు చర్యలు ‘డమ్మీ’ కలాసీలను పెట్టాలంటూ ఒత్తిడి.. రూ. 1.30 కోట్ల స్కామ్పై విచారణకు డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు ఓ నిజమైన మత్స్యకారుడికి అధికారులు తీవ్ర అన్యాయం చేసిన ఘటన పోలాకి మండలం అంపలం పంచాయతీ రాజారాంపురం గ్రామంలో వెలుగుచూసింది. అర్హత ఉన్నా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా సదరు మత్స్యకారుడికి చెందిన రెండు బోట్లను ‘మత్స్యకార భరోసా’ పథకానికి అర్

BAGADI NARAYANARAO
2 days ago2 min read


బాలు....
నలభీముల్ని తలపించే ఘంటసాల తిరుగాడే వంటశాలలోకి కుడికాలు ముందుపెట్టి ప్రవేశించాడు. తనమీద అంత నమ్మకముంచిన కోదండపాణికోదండం! ‘దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజినీళ్ల ముంతగా.. పాలకు దాకగా..మధువుకు పాత్రగా.. రూపం ఏదైనా మన్నొకటేరా...!’ అని అతగాడితో పాడించుకున్నాడు. కానీ అనతికాలంలోనే తెరమీద రూపం ఎవరిదైనా ఆ పాటలన్నిటికీ రూపమిచ్చేది బాలు ఒకడేరా అనిపించేశాడు. ఆరోజే తెలిసింది... ఏనాటికొ ఈ గరీబు కాకపోడు నవాబని! ఇదిగో..నీకో ఉత్తరం: ఎంత తేనె తాగుతావో తెలీదుగానీ మాంచి గంగాజలం కొబ్బరిబొండమొకటి
Guest Writer
2 days ago3 min read


షర్మిలకు అందుకే హ్యాండిచ్చారు!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పార్టీలు, నాయకులు ఇచ్చే హామీలు, చెప్పే మాటలదీ అదే పరిస్థితి. అప్పటికి ఏది పనికొస్తుందనుకుంటే అదే చేస్తారు.. చెప్తారు. భవిష్యత్తు గురించి చేసే బాసలు మాత్రం దైవాధీనం. ప్రస్తుత రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ముంగిట ఇదే మరోసారి రుజువవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం బాధితురాలిగా ఈసారి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల నిలిచారు. రాజ్యసభకు పంపిస్తామని పార్టీ ఆమెకు ఇచ్చిన హామీ పెండింగులో ఉంది. దాన్ని నెరవేర్చే అవకాశం కూడా ముంగిట

DV RAMANA
2 days ago3 min read


విచారణలన్నీ వృథాయేనా?
మరోసారి ముసిముసి ముగింపు! పీజీ రిలీవ్ వసూళ్లపై చర్యలు శూన్యం జాతీయ ఎస్టీ కమిషన్ గడువు ముగిసినా స్పందించని యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జరిగిన విచారణ కూడా నవ్వులపాలైపోబోతుందా? అంటే అవుననే సమాధానం ఇచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. MNO,FNO లుగా పని చేస్తున్న 120 మందిలో నలుగురికి జీతాలు ఇచ్చి, 116 మందిని పస్తులుంచిన కేసులో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై త్ర
Prasad Satyam
3 days ago2 min read


తీరంలో పోటెత్తిన రక్తపు కెరటాలు!
ఫారో దీవుల్లో సముద్ర జీవుల ఊచకోత వార్షిక వేట పేరుతో వందలాది ప్రాణుల హతం కొక్కీలతో పొడిచి, కత్తులతో నరికి కిరాతక హత్యాకాండ తీరం నిండా తిమింగలాలు, డాల్ఫిన్ల కళేబరాలే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ‘దాదాగిరికి వచ్చినా.. దౌర్జన్యానికి వచ్చినా.. గూండాయిజానికి వచ్చినా.. గ్రూపులు కట్టడానికి వచ్చినా.. రాజకీయంతో వచ్చినా.. రౌడీయిజంతో వచ్చినా.. ఈ పోర్టుకే బలి అవుతారు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి!’ ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్న

DV RAMANA
3 days ago2 min read


భర్తను కత్తిపీటతో కడతేర్చిన భార్య..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మద్యం కోసం అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడికి దిగడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్న భర్తను.. భార్యే కత్తిపీటతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. ప్రకాష్నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు (49) గత ఏడాదిన్నరగా జలుమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్గా పనిచేస

BAGADI NARAYANARAO
3 days ago1 min read


బాలూ.. స్వరకల్పన
చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరిమల్లెలు కొలిచీ ... 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు. జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బాపు, జంధ్యాల, సింగీతం లాంటి క్రియేటివ్ జీనియస్సుల దగ్గర సంగీతం చేశారు. అనేక గుర్తుండిపోయే గీతాలకు ప్రాణం పోశారు. కన్యాకుమారితో మొదలై జైత్రయాత్ర వరకు బాలు స్వరపరచిన తెలుగు పాటల సంఖ్య రెం
Guest Writer
3 days ago3 min read


పాత వివాదాలు రేపడమెందుకు?
తెలంగాణ ఎవరబ్బ జాగీరు కాదు.. కచ్చితంగా ఆ రాష్ట్రంలో నిలబడతాం.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని ఎన్నికల్లో ఇక నుంచి పోటీ చేస్తాం.. అంటూ మొన్న హైదరాబాద్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఊగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్.. ఆ తర్వాత బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో ఆంధ్రలో BRS ఎందుకు? అని ప్రశ్నించారు. అంటే తన జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదని నిగ్గదీసిన నోటితోనే.. దానికి పూర్తి విరుద్ధ

DV RAMANA
3 days ago2 min read


116 మందికి జీతాలు బకాయి.. నలుగురికే వరం
ఏవోను విచారించిన త్రీమెన్ కమిటీ వేతనాల ఫైల్ మాయం.. డీఎంహెచ్వో కార్యాలయంలో కలకలం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న 120 మంది ఎంఎన్వో, ఎఫఎన్వోలకు చెల్లించాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వలేదన్న కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు ఏవో బాబూరావు బృందంపై త్రీమెన్ కమిటీ విచారణ గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే నెలలో అందాల్సిన జీతం జూన్ వచ్చినా అందలేదని ఈ నెల ఒకటిన ఇచ్ఛాపురానికి చెందిన ఒక ఉద్యోగి గ్రీవెన్స్లో కలెక్టర
Prasad Satyam
4 days ago1 min read


రిమ్స్లో నిర్లక్ష్యపు ఉక్కపోత
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్పేషెంట్స్గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట

BAGADI NARAYANARAO
4 days ago1 min read


పెద్ది.. ‘ఆట’ను మించిన ‘ఆటగాడు’
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఎంతమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: పెద్ది (రామ్ చరణ్) విజయనగరం జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలోని ఒక ఊరికి చెందిన కుర్రాడు. ఈ ఊరికే పేరే కాదు.. ఏ రకమైన గుర్తింపూ
Guest Writer
4 days ago4 min read


బీజేపీపై అన్నామలై బండ!
దేశం మొత్తం మీద ఆధిపత్యం సాధించిన భారతీయ జనతాపార్టీ పాపం.. దక్షిణాదిలో మాత్రం పాగా వేయలేకపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి ఒకడుగు ముందుకేస్తే.. మÖడడుగులు వెనక్కి అన్నట్లు ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన కమలనాథులు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు దాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. తెలంగాణలో పుంజుకున్నట్లు కనిపించిన ప్రతిసారీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడం సంగతెలా ఉన్నా టీ

DV RAMANA
4 days ago2 min read


ఆయన తనిఖీల యాత్ర.. వసూళ్లదే కీలకపాత్ర
అయ్యగారొచ్చారు.. ముడుపు కట్టండ హో నియంత్రణ తప్పుతున్న అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ తనిఖీలు, రెన్యూవల్స్, అనుమతుల పేరుతో వసూళ్లు నలుగురు ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా అక్రమాల పర్వం పెద్ద మెడికల్ షాపులు, ల్సేల్ ఏజెన్సీలే టార్గెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అయ్యగారు తనిఖీ చేశారంటే ఆ షాపు సీజ్ కావాల్సిందే. మెమో ఇచ్చారంటే.. తదుపరి చర్యల్లేకుండా ముడుపులతో మూతి కట్టాల్సిందే. ఆయన ఎవరిని కలవడానికి రమ్మన్నా.. ఆయన్ను ఎవరు కలిసినా ఏదో మూడినట్లే. వెరసి ఆయన విచ్చలవిడితనానికి నియంత్రణ ల

BAGADI NARAYANARAO
6 days ago2 min read


ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే... సామరస్యం వస్తుందా?
కొత్త చర్చకు తెరలేపిన ముస్లిం నేతలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ దేశ రాజకీయాల్లో, మత సంబంధ చర్చల్లో ఆవు అంశం ఎప్పుడూ సున్నితమైనదే. హిందూ సమాజంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే దశాబ్దాలుగా ఆరఎసఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఈ డిమాండ్కు ఊహించని మద్దతు లభించింది. కొందరు ప్రముఖ ముస్లిం మతపెద్దలు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని
SATYAM DAILY
6 days ago2 min read


వయసు కేవలం సంఖ్యే
విరాట్ నుంచి వైభవ్ వరకు ఐపీఎల్ చెప్పిన గొప్ప పాఠం! వయసు కేవలం సంఖ్య మాత్రమేనని విరాట్ కోహ్లీ చూపిస్తే, అదే విషయాన్ని మరో కోణంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా నిరూపించాడు. ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ 776 పరుగులు సాధించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టాడు. 237 స్ట్రైక్రేట్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్ను చూసి క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అసాధారణమైన షాట్ సెలెక్షన్, అద్భుతమైన టైమింగ్, అపారమైన ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు అతడిని ప్
SATYAM DAILY
6 days ago2 min read


వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి
ఆర్డర్ చేసిన మహిళకు డెలివరీ బాయ్ వేధింపులు క్విక్ కామర్స్ యాప్ల్లో మహిళల గోప్యతకు ముప్పు? మీకు వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి’ అంటూ ఆన్లైన్లో వైబ్రేటర్ ఆర్డర్ను చేసిన ఒక మహిళకు డెలివరీ బాయ్ వేధించిన విషయం ఇప్ప్పుడు దేశంలో ఈకామర్స్ ప్లాట్ఫామ్స్పై చర్చకు దారితీసింది. వ్యక్తిగత ఉత్పత్తుల డెలివరీల్లో షాకింగ్ వాస్తవాలు ఇప్ప్పుడిప్ప్పుడే బయటకొస్తున్నాయి. కరోనా తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, బ్లింకిట్తో పాటు వందలాది ఈకామర్స్ ప్లాట్ఫామ్లలో ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్
Guest Writer
6 days ago2 min read
bottom of page


