top of page


బానకచర్ల వెనుకబాట!
వృథాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసేందుకు దశాబ్దాలనాటు ప్రతిపాదించిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు ఇప్పటికీ వివాదాల ఉచ్చు నుంచి బయటకు రాలేకపోతున్నది. దశాబ్దాలపాటు ప్రతిపాదనల్లో మగ్గిపోయిన ఈ ప్రాజెక్టుకు 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో చేర్చి, నిర్మాణానికి అంకురార్పణ చేసింది. తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలో ఈ భారీ బహుళార్థసాధక పథకానికి జాతీయ హÃదా కల్పించడంతో పాటు నిర్మాణానికి అవసరమైన నిధులు అందించేందుకు అంగీకరించింది. ఎట్టకేలకు పోలవరం పట్టాలు ఎక్క

DV RAMANA
11 hours ago2 min read


సొంతింటి కలను చెరిపేస్తున్న జెన్జీ!
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’.. అన్నారు పెద్దలు. అలాగే ‘కూడు, గూడు, గుడ్డ’ అన్న నినాదం కూడా ముఖ్యమైనదే. ఈ రెండింటిలో ఉన్న కామన్ సబ్జెక్టు ఇల్లు. దీన్ని బట్టే మనిషి లేదా ఒక కుటుంబం జీవించడానికి నీడనిచ్చే ఒక ఇల్లు ఉండాల్సిందేనని వీటి ద్వారా స్పష్టమవుతుంది. అందుకే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన యువకులు మొదట సొంతిల్లు సమకూర్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. అది సమకూరిన తర్వాతే పెళ్లి విషయం ఆలోచిస్తారు. నిన్న మొన్నటివరకు ఇలాగే ఉన్న యువత ఆలోచన ధోరణి.. ఈమధ్

DV RAMANA
1 day ago3 min read


నగర జీవనానికి ట్రాఫిక్ బ్రేకులు!
పెద్ద నగరాల్లో ఉదయం ఎనిమిది నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు ప్రధాన రహదారులు విపరీతమైన రద్దీగా ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణించేవారు గంటల తరబడి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవడం వంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటూనే ఉంటారు. ఇక భారీవర్షాలు పడినప్పుడైతే పరిస్థితి నరకం కంటే దారుణంగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు. ఫలితంగా నగరాల్లో జీవిస్తున్నవారు ప్రతిరోజూ నాలుగోవంతుకు పైగా సమయాన్ని ప్రయాణానికే వెచ్చించాల్సి వస్తున్నది. పెరుగుతున్న నగరీకరణ, జనాభా, వలసలు.. అందుక

DV RAMANA
2 days ago3 min read


ఆస్తులు అమ్మేసుకుంటున్న NRIలు!
దూరపు కొండలు నునుపు అని అంటారు. మనదేశపు శ్రీమంతులు కూడా అదే అభిప్రాయంతో విదేశాల పట్ల మక్కువ చూపిస్తుండటం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఉన్నత చదువుల పేరుతో విదేశాలకు వెళ్తున్న చాలామంది యువత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఇండియాకు తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయి ఉద్యోగాల, వృత్తి వ్యాపకాల్లో స్థిరపడిపోతున్నారు. యువత పరిస్థితి ఇలా ఉంటే.. విదేశాల్లో వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి అవకాశాలు చూసుకుని కుటుంబాలతో అక్కడే స్థిరపడుతున్నవారు ఇంకొందరు. ఇక స్వదేశమైన ఇండియాలో అనేక రంగాల్లో బా

DV RAMANA
3 days ago3 min read


భోగాపురంలో పొగడ్తల టేకాఫ్!
చూసేవన్నీ నిజాలు కావు.. అన్న నానుడి పూర్వకాలం నుంచే ఉంది. అలాగే చూసే కళ్లను బట్టే సంఘటనలు, వాటికి అర్థాలు కూడా మారిపోతుంటాయన్నది అనుభవైకవేద్యమే. మిగతా రంగాల సంగతి ఏమో గానీ.. రాజకీయాల్లో మాత్రం ఈ నానుడిలు అతికినట్లు సరిపోతాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరని తరచూ అంటుంటారు. దానికి తగినట్లే ఒక్క క్షణం ముందు వరకు మిత్రులుగా ఉన్నవారు అంతలోనే ప్లేటు ఫిరాయించేసి శత్రువులుగా మారిపోతుంటారు. ఆరోపణలు, విమర్శలతో కత్తులు నూరుతుంటారు. అదేవిధంగా నిన్నటివరకు

DV RAMANA
4 days ago3 min read


వాయుగుండాల వెక్కిరింత!
ఆకాశం నిండా మబ్బులు కనిపిస్తున్నాయి. కానీ వాటివైపు ఆశగా చూస్తూ ముంత ఒలకబోసుకోవడమే తప్ప అవి మాత్రం చుక్క నీరైనా రాల్చడంలేదు. నైరుతి రుతుపవనాల సీజను మొదలై రెండు నెలలు గడిచినా ఒక్కటంటే ఒక్కటైనా సరైన వర్షం కురవడం లేదు. అల్పపీడనాలు, వాయుగుండాలు సంభవిస్తున్నా.. అవి మనల్ని వెక్కిరిస్తూ ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి భారీగా వర్షాలు కురిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లు ఎల్నినో మనదాకా వచ్చేసినట్లే ఉంది. దాని ప్రభావంతోనే మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్త

DV RAMANA
5 days ago2 min read


ప్రజాస్వామ్యంలో విరాళాలస్వామ్యం!
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. వారి ఓట్లతోనే ఎవరైనా అధికార పగ్గాలు చేపట్టగలిగేది. వారు తిరస్కరిస్తే ఎంతటి వారైనా శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. పవిత్రమైన ఈ ప్రక్రియలో ఓటుకే తప్ప నోటుకు అసలు విలువ ఉండకూడదు. కానీ పరిస్థితి ఒకప్పటిలా లేదు. ప్రజాసమస్యల పరిష్కారంలో, వారి తరఫున చట్టసభలకు ఎన్నికయ్యే విషయంలో, నిరంతరం ప్రజల్లో ఉండేందుకు, కార్యక్రమాలు, కార్యాలయాలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలకు కొంత ఖర్చవుతుందన్నది వాస్తవం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వాలు రాజకీయ పార్టీల కార్

DV RAMANA
Aug 13 min read


మారుతున్న జెన్జీ ఉద్యోగుల దృక్పథం!
ఇప్ప్పుడు ఎక్కడ చూసినా జెన్జీ ముచ్చట్లే. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జెన్జీగా పిలిపించుకున్న యువతరం ఉద్యమ కెరటాల్లా ఉవ్వెత్తున ఎగసి అక్కడి ప్రభుత్వాలనే ముంచేశాయి. పరిపాలనను తమ చెప్ప్పుచేతల్లోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో తెరపైకి వచ్చిన జెన్జీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై సమర శంఖం పూరించి అనూహ్య విజయం సాధించింది. సుమారు నెలరోజుల ఈ ఉద్యమం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేలా క

DV RAMANA
Jul 313 min read


వరద విలయంలో అసోం విలవిల
అసోం దుఃఖదాయినిగా బ్రహ్మపుత్ర నదికి ఒక చెడ్డపేరు ఉంది. ఈ పేరు నిన్నో మొన్నో రాలేదు. కొన్ని శతాబ్దాల నుంచి అది కొనసాగుతున్నది. ఈ పేరు ఎందుకు వచ్చిందో తాజాగా అసోంను ముంచెత్తుతున్న వరదలను, వాటి విలయాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఏటా వరద తాకిడికి గురికావడం ఈశాన్య రాష్ట్రమైన అసోంకు అలవాటే. కానీ ఈసారి ఈ విలయం మరింత విషాదం సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 67 మంది వరదల్లో కొట్టుకుపోవడమో, చనిపోవడమో జరిగింది. 650కి పైగా గ్రామాýను వరద ముంచెత్తింది. ఆరు లక్షలమందికి పైగా ప

DV RAMANA
Jul 302 min read


పేరు పెద్ద.. ఊరు దిబ్బ!
నగర జీవనం అందరికీ ఇష్టమే. అందులోనూ ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో దాదాపు అన్ని దేశాల్లోనూ నగరీకరణ శరవేగంగా విస్తరిస్తున్నది. దానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వినోద కేంద్రాలు, ఇతరత్రా వ్యాపకాలు చాలావరకు పట్టణాలు, నగరాల్లోనే కేంద్రీకృతమవుతన్నాయి. ఫలితంగా ప్రజలు తమ అవసరాలను వెతుక్కుంటూ పల్లెలను వీడి నగరాల బాట పడుతున్నారు. దాంతో నగరాలు జనాలతో కిక్కిరిసిపోతూ కాంక్రీట్ జంగిల్స్గా మారుతున్నాయి. అయితే దూరపు కొండలు నునుపు అన్నట్లు నగర జీవనం దూరం నుంచి చూసేవారికి అదో అద్భుత యోగం, అనుభవంల

DV RAMANA
Jul 293 min read


కాక్రోచ్ విజయానికి కాంగ్రెస్ బాజాలు!
ఎవరో.. ఏదో సాధిస్తే.. దాన్ని మనమే సాధించినట్లు చంకలు గుద్దుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. తన చేష్టలతో ప్రజల్లో మరింత చులకన అవుతున్నది. సుమారు నెలరోజులుగా దేశంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉద్యమం కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, అసలు ప్రజల్లోనే లేని కొందరు వ్యక్తులు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా వేదికగా నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లీకేజీ బాధిత వి

DV RAMANA
Jul 283 min read


యువతరం శిరమెత్తితే..!
దేశ రాజకీయాలు కొత్త పుంతల తొక్కుతున్నాయి. ప్రజల మనోభావాల్లో కూడా యువోత్సాహం తొణికిసలాడుతన్నది. ఈ మార్పులకు సంకేతం ఢిల్లీ పీఠాన్ని వణికించిన జెన్జీ ఉద్యమంగా చెప్పవచ్చు. మన దేశ రాజకీయాలను పరిశీలిస్తే తొలి నుంచీ యువతరం పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది. ప్రాతినిధ్యం వహించిన కొద్దిపాటి యువ నేతలు కూడా రాజకీయ కుటుంబాలకు చెందినవారో, ప్రముఖుల వారసులో కావడం మొదటి నుంచీ కొనసాగుతన్నది. కానీ నీట్ లీకేజీ బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ 26 రోజులపాటు ఢిల్లీ జంతర్ కేంద్రంగా సాగిన ఉద్యమం దేశ

DV RAMANA
Jul 273 min read


‘నీట్ ’గా ఇరుక్కున్న కేంద్రం!
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం అనంతరం మళ్లీ నీట్ పరీక్షలు నిర్వహించడం, ర్యాంకర్లకు సీట్లు కేటాయించడం.. అన్నీ జరిగిపోవడంతో ఇక లీకేజీ ఉదంతం తెరమరుగైపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో ఉరుము లేని పిడుగులో సోషల్ మీడియా ప్లాట్ఫారంపై పురుడు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ పార్టీని నిర్వాహకులు ప్రకటించినప్పుడు అదేదో ప్రభుత్వాలపై సెటైర్లు వేసి నాలు

DV RAMANA
Jul 252 min read


నెలన్నరగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
ప్రస్తుతం దేశం దృష్టంతా దేశ రాజధాని ఢిల్లీపై ఉంది. చర్చంతా కాక్రోచ్ పార్టీపైన.. అది చేస్తున్న ఉద్యమంపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ ఉద్రిక్తతలు, వివాదాల జడిలో దేశంలో జరుగుతున్న ఇతర పరిణామాలు ఎవరికీ పట్టడం లేదు. ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగితే పదేపదే దాన్ని ప్రొజెక్టు చేస్తూ.. మిగితా అంశాలను గాలికొదిలేసే మన మీడియా తీరు కూడా దీనికి ఒక కారణం. పాకిస్తాన్లోన, శ్రీలంకలోనూ పెట్రోల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు తారాజువ్వల్లా ఎగసిపడుతున్నాయని ఆ మధ్య జాతీయ మీడియాలో కోకొల్లలుగా వార్తలు వచ్చా

DV RAMANA
Jul 243 min read


ధర్మేంద్రుడి ముందంతా ముళ్లబాటే!
దేశమంతా ఇప్పుడు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నది. అదే కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ పార్టీ చేపట్టిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్. ఈ డిమాండ్తో గత కొన్నిరోజులుగా లడ్డాఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, దానికి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ ఛలో పార్లమెంటు ఉద్యమానికి పిలుపునివ్వడం, దేశంలోని చాలా ప్రాంతాల నుంచి విద్యార్థులు,

DV RAMANA
Jul 232 min read


అపరిచితుడి చేతిలో ఉద్యమ రాయి!
ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి అపరిమితంగా పెరిగినప్పుడు దానికి ఒక బలమైన సిద్ధాంతం తోడైనప్పుడు, దానికి ఒక సమర్థమైన నాయకత్వం లభించినప్పుడు వాటి నుంచి ఒక బలమైన ఉద్యమం పుడుతుంది. కానీ అదేం చిత్రమో గానీ.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఉద్యమం వెనుక యువజనుల్లో పేరుకుపోయిన కొండంత అసంతృప్తి కనిపిస్తున్నా.. దానికి ఒక సైద్ధాంతికత గానీ, ప్రముఖ నాయకత్వం గానీ కనిపించడం లేదు. దీన్ని నడుపుతున్న అభిజిత్ దిబ్కే గానీ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్

DV RAMANA
Jul 223 min read


ఉచితానికి చెల్లు.. ఇక UPI బాదుడు!
పూర్వం జేబులో నిండుగా డబ్బులు ఉంటే తప్ప బజారు చేయడం సాధ్యమయ్యేది కాదు. కాలక్రమేణా డబ్బుతో పనిలేకుండా పోయింది. నగదు స్థానంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ (ఏటీఎం) కార్డులు ఉంటే మార్కెట్లో పెద్దపెద్ద లావాదేవీలను ఇట్టే చక్కబెట్టేసే సౌలభ్యం ఏర్పడింది. ఇక ఆధునిక యుగంలో కరెన్సీతో పాటు కార్డుల అవసరం కూడా లేకుండాపోయింది. యÖనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెల్లింపు వ్యవస్థ అంతా మన సెల్ఫోన్లలోకి వచ్చేసింది. జేబులో సెల్ఫోన్ అందులో య

DV RAMANA
Jul 213 min read


‘స్థానిక’ సీట్లపై తలోమాట.. తెస్తుందా తలపోటు
‘రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగేలా మేం కలిసి ఉంటాం. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు’.. అని స్వయంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కొన్నాళ్ల క్రితం ఉవాచించారు. కూటమి ప్రభుత్వం కొనసాగడమన్నది ప్రభుత్వ పనితీరు, ఆపై ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎన్నికల్లో తప్ప ఇప్పుడప్పుడే తేలేది కాదు. ఇకపోతే కూటమి పార్టీలు కలిసి ఉండటమన్నదానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సంగతేమో గానీ.. త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నిక

DV RAMANA
Jul 203 min read


హై.. హై.. రైల్వే శాఖ!
సుమారుగా రెండు శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ రైల్వేల్లో మరో కొత్త శకం ప్రారంభ మైంది. దేశంలోని తొట్టతొలి హైడ్రోజన్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపడంతో పట్టాలపై పరుగులు తీయడం మన రైల్వేలు సాధించిన మరో అద్భుత విజయంగా చెప్పవచ్చు. జీరో కాలుష్యంతో పూర్తిస్థాయి గ్రీన్ రైలు కావడం మరో విశేషం. దాదాపు నీటితోనే నడిచే ఈ రైలు విని యోగం తర్వాత అదే నీటిని బయటకు విడిచిపెట్టడం దీని ప్రత్యేకత. హర్యానాలోని జింద్`సోనేపట్ మధ్య తొలి గ్రీన్ రైలు సర్వీస్ ప్రారంభం కావడంతో ప్రపంచంలో

DV RAMANA
Jul 183 min read


చైనా దుర్నీతికి చెప్పుదెబ్బ!
తనకు పెద్దగా పట్టులేని బంగాళాఖాతంలో ఇతర చిన్న దేశాల సాయంతో పాగా వేసి ఇంతవరకు ఈ సాగరంపై సంప్రదాయకంగా భారత్కు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించని విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణచైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికా సహా 14 దేశాలు బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహిం

DV RAMANA
Jul 173 min read
bottom of page


