top of page


మతతత్వం పోయినట్లా.. పెరిగినట్లా?
తూర్పు భారతంలో వంగ దేశం(పశ్చిమ బెంగాల్)లో కొత్త పొద్దు పొడిచింది. కమలం వికసించింది. కాషాయ జెండా ఎగిరింది. వెరసి హిందూ అజెండా, సనాతన ధర్మం తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమÖల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి 200పైగా స్థానాల్లో విజయం కేతనం ఎగురువేసిన సంఫtT పరివార్కు చెందిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ప్రభుత్వంలో బెంగాల్ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ పార్టీని విజయపథంలో నిడిపించిన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం

DV RAMANA
13 hours ago3 min read


గవర్నర్లది ‘వివక్షా’ధికారం!
బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలనకు చిహ్నాలుగా ఉన్న రాజ్భవన్ల పేరును లోక్భవన్లుగా మారుస్తూ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ నివాస భవనాన్నే రాజ్భవన్గా వ్యవహరించేవారు. అందుకు తగినట్లే గవర్నర్లు రాష్ట్రానికి తామే రాజులమన్నట్లు విర్రవీగిపోయేవారు. రాచరిక వ్యవస్థలు, బ్రిటిష్పాలనలు పోయి మన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన విషయాన్ని దాదాపు 75 ఏళ్ల తర్వాత గుర్తించిన కేంద్రం రాజ్భవన్ పేరును లోక్భవన్ అంటే ప్రజాభవన్గా మార్చింది. కానీ పేరు మారిన పాత రాజకీయ వా

DV RAMANA
2 days ago3 min read


మమత పదవిలో ఉన్నా.. ఊడినట్లే!
ఎన్నికలు జరిగాయి.. ఫలితాలు వెలువడ్డాయి.. ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అన్నది తేలిపోయింది. ఆ ప్రకారం అధికార మార్పిడి జరగడమన్నది తదుపరి రాజ్యాంగ ప్రక్రియ. కానీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఘట్టం విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీకి పది సీట్ల దూరంలోనే టీవీకే పార్టీ నిలిచిపోవడాన్ని సాకుగా చూపించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది మద్దతుదారుల వివరాలతో రావాలని గవర్నర్ ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించిన ట

DV RAMANA
3 days ago2 min read


కమలం యూజ్ అండ్ త్రో రాజకీయం!
లోకరీతి మారిపోతున్నది. న్యాయంగా చూస్తే.. ఎదుగుదలకు సహకరించినవారిని గౌరవించాలి.. వీలయితే మనతో సమానంగా చూడాలి. కానీ సమకాలీన రాజకీయాల్లో ఆ నీతి.. రీతి లుప్తమైపోయాయి. చేయి అందించి పైకి తీసుకొచ్చినవారినే కిందకి లాగేసే అడ్డగోలు రాజకీయమే ఇప్పుడు వర్థిల్లుతున్నది. అవసరం ఉన్నంతవరకు రాజకీయ మిత్రులంటూ తెగ వాడేసుకోవడం.. మన అవసరం తీరాక, ఇక మిత్రుడితో పనిలేదని తేలిపోయాక.. వదిలించుకోవడం నేటి రాజకీయ విజయసూత్రంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా చేజిక్కించుకుంటూ వస్

DV RAMANA
5 days ago3 min read


అమెరికా కోరల్లో కమ్యూనిస్టు క్యూబా!
వెనిజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి తమ దేశంలోని జైల్లో కూర్చోబెట్టారు. ఇరాన్పై సరైన కారణాలు లేకుండానే సైనిక చర్యకు తెగించి.. ఒక్క ఇరాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టేశారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ముగిసినట్లేనని తనకు తానుగా ప్రకటించేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే నోటితో మరో బాంబు పేల్చారు. చిన్న దేశమైన క్యూబాపై అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామన్నారు. అగ్రరాజ్యం అధినేతనన్న విషయం మర్చిపోయి చిన్నదైనా

DV RAMANA
6 days ago2 min read


బెంగాల్ తీర్పు.. కోరుతోందా మార్పు?
మినీ జనరల్ ఎలక్షన్స్గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు దేశప్రజల దృష్టి ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో అసోం, పుదుచ్చేరి, కేరళం ఫలితాలపై పెద్ద ఉత్సుకత కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్ సాధించనుండగా పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే కేరళంలో అక్కడి సంప్రదాయానికి అనుగుణంగా ఓటర్లు అధికార ఎల్డీఎఫ్కు విశ్రాంతినిచ్చి యÖడీఎఫ్కు పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటికి

DV RAMANA
May 22 min read


ఒంటరి జీవితం ప్రమోదం కాదు!
బ్రహ్మచారి జీవితం భలే హ్యాపీ అని సాధారణంగా అంటుంటారు. అందుకే హిందీలో ఏక్ నిరంజన్.. అని అంటారు. ఏకాకి జీవితం గడిపేవారు తమకు తమే రాజు అని స్థూలంగా దీనర్ధం. పెళ్లిపెటాకులు లేకుండా సింగిల్గా మింగిల్ అయిపోవడం ఒకరకంగా కేర్ ఫ్రీ జీవితమే కావచ్చు. కానీ దానివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి, కుటుంబం వంటి బాదరబందీల్లేకుండా ఒంటరిగా గడపేవారిని గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతోపాటు మానసిక రుగ్మతలు సోకే ప్రమాదముందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. .

DV RAMANA
May 13 min read


UAE నిర్ణయం భారత్కు వరం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్ను కాస్త ఉపశమింపజేసేదిగా.. అదే సమయంలో పాకిస్తాన్ను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేదిగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(ఒపెక్) నుంచి వైదొలగుతున్నట్లు UAE ప్రకటించింది. మే ఒకటో తేదీ అంటే రేపటినుంచే ఇది అమల్లోకి రానుంది.

DV RAMANA
Apr 302 min read


స్లీపర్ బస్సులకు సెలవేనా?!
స్టేజ్ క్యారియర్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ నెంబర్లను చూస్తే దాదాపు ఏ ఒక్కటీ ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి కావని అంతో ఇంతో చదువుకున్న వారందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మెజారిటీ ట్రావెల్స్ బస్సులు నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినవే. తక్కువ ఫీజులతో, కండీషన్ లేని రీమోడలింగ్ బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని రోడ్డెక్కేస్తున్న ఈ బస్సులు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్

DV RAMANA
Apr 293 min read


మళ్లీ రగులుతున్న నేపాల్
ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా గుర్తింపు పొందిన హిమాలయ దేశం నేపాల్ మనకు పొరుగు రాజ్యమే. పురాతన అఖండ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించిన నేపాల్తో ఇప్పటికీ మనకు సుదృఢమైన సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఓపీ శర్మ ఓలి ప్రభుత్వం భారత్ పట్ల కొంత విరోధ వైఖరి ప్రదర్శించినా గతంలో రాచరికం ఉన్నప్పుడు గానీ.. రాచరికం పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత గానీ ప్రభుత్వాల పరంగా, సామాజికంగా ఇరుదేశాల ప్రజల మధ్య నిరంతర సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. క

DV RAMANA
Apr 282 min read


గల్ఫ్ ఆశలను కూల్చిన యుద్ధం!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. అమెరికా`ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల పుట్టి ముంచింది. ప్రస్తుతం సీజ్ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ రెండో విడత చర్చలు మొదలుకాకుండానే వాయిదా పడిపోవడంతో ఏ క్షణంలోనైనా యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ఎడారి దేశాలు కట్టుకున్న ఆశల సౌధాలు దాదాపు కుప్పకూలిపోయాయి. మÖడు దశాబ్దాలకు పైగా ఇటుక ఇటుక పేర్చి ఇసుక నేలల్లో సృష్టించిన నందనవనాలు, టూరిజం ప్రాజెక్టులు, ఆకాశ హార్మ్యాలు, కాసుల వర్షం కురిపించే చమురు క్షేత్ర

DV RAMANA
Apr 273 min read


ఇది సామాన్యుడి అజెండానా.. చద్దాజీ!
సామాన్యుడి పార్టీ.. రాజకీయాల్లో, సమాజంలో అవినీతిని ఊడ్చేస్తామంటూ ప్రస్థానం ప్రారంభించిన చీపురు పార్టీని సొంత సభ్యులే కట్టగట్టుకుని పార్లమెంటులో దాని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ ఊడ్చేశారు. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న పదిమంది సభ్యుల్లో ఏడుగురు సొంత పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు రామ్ రామ్ చెప్పి.. కమలం పార్టీకి జైకొట్టారు. వారు పార్టీ ఫిరాయించడమే కాకుండా ఏకంగా ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించేశారు. దానికి అనుగుణంగానే వ్యూహాత్మకంగా పావులు కదిపా

DV RAMANA
Apr 253 min read


యుద్ధం మనలో మొదలైంది
యుద్ధం ఆగింది అనుకుంటున్నారా? కాదు.. అది ఇప్పుడు మనలో మొదలైంది. ఈ యుద్ధం బాంబులది కాదు.. మన ఆత్మల మీద జరుగుతున్న దాడి.! రెండుగా ముక్కలైన ప్రపంచం... మర్చిపోయిన మానవత్వం! లోకం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందని అనుకోవడం మన భ్రమ. బాంబుల మోత ఆగితే శాంతి వచ్చినట్టు కాదు. అది ఒక భయంకరమైన విరామం మాత్రమే. గాయంపైన చర్మం మొలిచింది.. కానీ లోపల చీము ఇంకా కారుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది సరిహద్దుల మీద జరిగే యుద్ధం కాదు. ఇది మన గుండెల్లో... మన ఆలోచనల్లో... మన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్లలో రగుల

DV RAMANA
Apr 243 min read


ఆంధ్ర నేతల ఢిల్లీ విధేయత సంక్షోభానికి సంకేతం
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి, పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ, దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తోంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి, ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపి

DV RAMANA
Apr 233 min read


ఇకనైనా పాఠాలు నేర్చుకోవాలి
భారతదేశం ఇక ఏమాత్రం విస్మరించలేని ఒక ఇంధన వాస్తవికతను ఎదుర్కొంటోంది. 2026 నాటి ఎల్పీజీ, ఎలఎన్జీ దిగుమతి ధరలు కేవలం తాత్కాలికం కాదు. ఇది ఒక దీర్ఘకాలిక హెచ్చరిక. అధిక ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశానికి, ఇంధన భద్రత లేకపోవడమనేది కేవలం ఒక అసౌకర్యం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ముప్పు. ఇక్కడ అసలు ప్రశ్న, భారతదేశం చర్యలు తీసుకోవాలా లేదా అని కాదు, ఎంత వేగంగా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయగలదు అనేదే. గణాంకాలు ఒక ఆందోళనకరమైన

DV RAMANA
Apr 223 min read


సుందర్ పిచైలు ఇక్కడికెందుకు రారు?
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థలను నడిపించే భారతీయ మేధావులు ఒకవైపు కనిపిస్తుంటే, అదే స్థాయి ప్రతిభ ఉన్న లక్షలాది మంది భారతీయులు సొంత దేశంలో గూగుల్ వంటి సంస్థలను ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ప్రపంచపు అతిపెద్ద ఐటీ దిగ్గజాలకు భారతీయులే సారథులు. సుందర్ పిచైలు, సత్య నాదెళ్లలు ప్రపంచ స్థాయి సంస్థలను నడిపిస్తున్నారు. మరి, అటువంటి మేధావులు సొంత గడ్డపై ఎందుకు గూగుల్ వంటి సామ్రాజ్యాలను నిర్మించలేకపోతున్నారు? ఈ ప్రశ్న వెనుక కేవలం మూలధన కొరత మాత్రమే లేదు, అంతకు మించి ప్రభుత్వ విధానాల

DV RAMANA
Apr 213 min read


చంద్రబాబు.. సెల్ఫ్ మేడ్ లీడర్
1996-2004 చంద్రబాబుకు, 2026 చంద్రబాబుకు ఎంత తేడా? ఆ రోజుల్లో ప్రధానులను మార్చి మార్చి నియమిస్తూ, మధ్యలో ప్రధాని పదవి తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా 14 సంవత్సరాల వయసులో ఉన్న లోకేష్ వద్దన్నాడని వదిలేసిన బాబు ఇప్ప్పుడెక్కడ? తర్వాత కాలంలో హరికిషన్సింగ్ సుర్జిత్, ఏబీ బర్దన్, డి.రాజా.. ఇంకా చిన్నాచితగా ఢిల్లీలో ఉండే నాయకుల్ని ఏమార్చి 1998లో బీజేపీ పెద్దల దగ్గరికి పోయి స్పీకర్గా బాలయోగిని చేసి తలుపు ఓరగా వేసి గడప బయట నుంచే మద్దతు ఇస్తారంటూ సమస్య వచ్చినప్పుడల్లా చక్రం తిప్పిన చంద్రబ

DV RAMANA
Apr 203 min read


రాష్ట్రంలో రాజకీయ శూన్యత!
అధికార కూటమి సంఖ్యాబలం సరిపోక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయినప్పటికీ.. దానిపై చర్చ, ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే డీలిమిటేషన్ అనేది జనాభా(డెమోగ్రాఫిక్) బాంబులా మారినట్లు కనిపిస్తున్నది. జానాభా దామాషా పద్ధతిలో జరిగే పునర్విభజన వల్ల సీట్ల విషయంలో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య భారీ వ్యత్యాసం చోటుచేసుకుంటుందన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్నది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడం వ

DV RAMANA
Apr 183 min read


అనవసర ప్రసంగంతో అనర్థం!
అనువుగాని వేళ అక్కరకు రాని విషయాలు మాట్లాడితే.. దాన్నే అప్రస్తుత ప్రసంగం అంటారు. ఇందులో ప్రసంగీకుల లక్ష్యం మంచిదే కావచ్చు గానీ.. సందర్భం లేకుండా ప్రస్తావిస్తే మాత్రం ఆ లక్ష్యం నీరుగారిపోవడమే కాకుండా.. విమర్శల తాకిడి పెరిగి ఉన్న పరువు పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి లోక్సభ సాక్షిగా అధికార బీజేపీ పరిస్థితి అలాగే తయారైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదమే లక్ష్యంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మేరకు గురువారం లోక్సభలో ర

DV RAMANA
Apr 173 min read


ఉత్తరాదిని మనం ఎన్నాళ్లు మోయాలి?
ప్రస్తుత 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత వస్తుందో, రాదో గురువారం తెలిసిపోతుంది. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబోతున్నారు. ఈ పెంపునకు హేతుబద్ధత ఏంటో తెలియదు. ఇప్పుడు 2026 సెన్సెస్ తర్వాత డీ లిమిటేషన్ చేపట్టాలి. కానీ 2026 సెన్సస్కు ముందే ఆదరాబాదరగా డీ లిమిటేషన్ చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఏం{నేది స్పష్టం కావాలి. ఎందుకంటే దీని కోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నారు. తెలివిగా దీనికి మహిళా ర

DV RAMANA
Apr 163 min read
bottom of page


