ఈ హీరోయిన్ పరిస్థితి మహా దారుణం!
- Guest Writer
- Aug 18, 2025
- 3 min read

ఒకప్పుడు రాజభోగాలు అనుభవించింది.. ఇప్పుడు తిండికి గతిలేక భిక్షాటన చేస్తోంది.. ఈ హీరోయిన్ పరిస్థితి మహా దారుణం. సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకసారి గుర్తింపు వచ్చిందంటే.. ఇక వారి కెరీర్కు లోటు ఉండదు. ఈ పాపులారిటీతోనే కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరో, హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు.
సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకసారి గుర్తింపు వచ్చిందంటే.. ఇక వారి కెరీర్కు లోటు ఉండదు. ఈ పాపులారిటీతోనే కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరో, హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. ఇలా 30, 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగినవారున్నారు. ఓ నటి సైతం భారతీయ టెలివిజన్ ఇండస్ట్రీలో ఏకంగా 30 ఏళ్లకు పైగా నటించింది. టీవీ సీరియల్స్లో యూనిక్ రోల్స్తో పాపులర్ అయింది. అయితే కెరీర్ పీక్స్లో ఉండగా ఆమె తీసుకున్న నిర్ణయం, తన జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు లగ్జరీ లైఫ్ గడిపిన ఆ నటి.. ఇప్పుడు రోజు గడవటానికి భిక్షాటన చేస్తోంది. ఆమె ఎవరో కాదు.. నుపూర్ అలంకార్.
ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీని దాదాపు 3 దశాబ్దాల పాటు ఏలిన నటి.. నుపూర్ అలంకార్. 1972, నవంబర్ 25న జైపూర్లో జన్మించింది. శక్తిమాన్, దియా ఔర్ బాతి హమ్, ఘర్కి లక్ష్మీ బేటియాన్ వంటి పాపులర్ సీరియల్స్ సహా 157కి పైగా టెలివిజన్ షోలు చేసింది. అయితే, కెరీర్ పీక్స్లో ఉండగా కొంతమంది మాత్రమే సాహసం చేసే నిర్ణయాన్ని తీసుకుని అందరినీ షాక్కి గురిచేసింది. 2022 ఫిబ్రవరిలో ఆమె ఈ ప్రాపంచిక జీవితానికి గుడ్బై చెప్పి సన్యాసం స్వీకరించింది. ఇక, తన జీవితాన్ని ఆధ్యాత్మిక విషయాలకు అంకితం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
ఆధ్యాత్మిక సాధన:
ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావాలని నుపూర్ అనుకోవడం, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పటి నుంచో ఈ మార్గాన్ని పాటించాలని ఆమె భావించింది. గురువు శంభు శరణ్ రaా గైడెన్స్లో నుపూర్ ఆధ్యాత్మికతలో మునిగిపోయింది. యమునా, గంగా వంటి పవిత్ర నదులను సందర్శించింది. హిమాలయాల్లో ట్రావెల్ చేసింది. ఏకాంత ఆశ్రమాలు, పురాతన గుహల్లో నివసించింది. ఇలా, భౌతికంగానే కాక.. దైవంతో ఐక్యతను కోరుతూ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్గా ఈ జర్నీ మారింది.
పర్సనల్ లైఫ్ ఎఫెక్టా?
నుపూర్ తన కో-యాక్టర్ అలంకార్ శ్రీవాస్తవను 2002లో వివాహం చేసుకుంది. మొదట్లో వీరి బంధం బాగానే కొనసాగినా.. తర్వాత వారి మధ్య దూరం పెరిగింది. నుపూర్ క్రమంగా ఆధ్యాత్మికత వైపు అట్రాక్ట్ అయింది. దీంతో వీరిద్దరూ రెండున్నర ఏళ్ల పాటు విడివిడిగానే జీవించారు. 2022లో నుపూర్ సంసార జీవితాన్ని వదిలిపెట్టి సన్యాసం స్వీకరించింది. అయితే, సన్యాసిగా మారాలనే తన నిర్ణయం ఆధ్యాత్మిక పిలుపని, పూర్తి స్వతంత్రంగా, విచక్షణతో తీసుకున్నదని ఆమె ప్రకటించింది. వ్యక్తిగత, వైవాహిక జీవిత సమస్యలు దీనికి కారణం కావని క్లారిటీ ఇచ్చింది. అయితే, వీరికి పిల్లలు లేరు.
ప్రస్తుతం ఏం చేస్తోందంటే?
నుపూర్ అలంకార్.. సన్యాసి అయ్యాక తన ఆస్తులను పూర్తిగా వదిలేసుకుంది. ఆమె కాషాయ వస్త్రాలు ధరించి, కనీస అవసరాలతో జీవించే ఆధ్యాత్మిక జీవనశైలిని పాటిస్తోంది. డబ్బులు సంపాదించే ఏ పనిని కూడా చేయబోనని డిసైడ్ అయ్యింది. సంప్రదాయ సన్యాసుల మాదిరే.. ఆమె కూడా భిక్షాటనతో పొట్ట నింపుకుంటోంది. విరాళాలు, ఇతరుల దయపై ఆధారపడి జీవిస్తోంది. తన జీవితాన్ని స్పిరిచువల్ గ్రోత్, మెడిటేషన్, ప్రజల సేవకు అంకితం చేసినట్లు వెల్లడిరచింది.
అదో పెద్ద బాలశిక్ష

గత ఏడాది రాసింది.. ఈ ఏడాది ఇంకా రాయలేదు. షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే, ఆ సినిమా ఆపరేటర్ కూడా అన్నిసార్లు చూసి వుండడు. నా పాలిట అదో డ్రగ్. ఇప్పటికీ నిద్ర రాకపోతే చూస్తూ నిద్రపోతాను. ఏముంది దాంట్లో. జస్ట్ క్రైం థ్రిల్లర్. బందిపోట్లు మీద వచ్చిన ఎన్నో సినిమాలకి కాపీ.
సెవెన్ సమురాయ్, ఫైవ్ మాన్ ఆర్మీ, మేరాగావ్ మేరా దేశ్, ఖోటే సిక్కే ఇవన్నీ కలిస్తేనే షోలే కదా. నిజమే. జస్ట్ కాపీ అయితే షోలే ఎపుడో గాలికి పోయేది. ఆ సినిమాలో అంతు చిక్కని ఫిలసాఫికల్ జర్నీ వుంది. సలీం -జావేద్ రచనలోని గొప్పతనం అది. అంత గొప్పగా మళ్లీ వాళ్లు కూడా రాయలేకపోయారు. పల్ప్ రాసి విడిపోయారు.
కథలు రాసుకోవడంలో పల్టీలు కొట్టే అనేక మంది డైరెక్టర్లకి, రచయితలకి షోలే ఒక పెద్ద బాలశిక్ష.
1. రైలుతో ప్రారంభమైన సినిమా రైలుతోనే ముగుస్తుంది. జీవితం ఒక ప్రయాణం.
2. ప్రాణస్నేహితుడితో ఆనందంగా రైలు దిగిన ధర్మేంద్ర చివరికి స్నేహితుడు లేకుండా, కొత్త స్నేహితురాలితో తిరిగి వెళ్తాడు. ప్రయాణంలో మనతో ఉన్నవాళ్లు దిగిపోతారు. కొత్తవాళ్లు కలుస్తారు. మనం కూడా దిగిపోతాం. రైల్లోవుంటే దిగే స్టేషన్ తెలుసు. జీవితంలో స్టేషన్ ఎక్కడుందో తెలియదు.
3. ప్రపంచంలో అత్యంత భారం ఏమంటే కొడుకు శవపేటికని భుజాల మీద తండ్రి మోయడం. ఈ డైలాగ్ రాయాలంటే చాలా తెలియాలి. ఈ సీన్లో ఎకె.హంగల్ సాబ్ ఎక్స్ప్రెషన్ గొప్పది. లోపల ఏదో పిండేస్తుంది. చిన్నప్పుడు అర్థం కాలేదు. పెద్దయ్యాక కొంతమంది తండ్రులు బిడ్డల్ని పోగొట్టుకుంటూ వుంటే ఈ డైలాగ్ గుర్తొచ్చేది. భుజాల మీద మోసిన పిల్లల్ని, భుజాల మీద మోసే కష్టం ఎవరికీ రాకూడదు.
4. జీవితం అంతా బాగుంది, బాగుంటుందని అనుకుంటున్నప్పుడు దెబ్బ కొడుతుంది. పెళ్లి చేసుకుని, కాసింత పొలం కొనుక్కుని బతుకుదామనుకున్న అమితాబ్ అర్ధాంతరంగా చనిపోతాడు.
5. ఎందుకీ పనికిరానివాళ్లు కూడా కొన్నిసార్లు పనికొస్తారు. చెల్లని నాణెం రెండు వైపులా చెల్లదని జైలర్ అంటే (ఫస్ట్ సీన్) నాణేనికి, మనిషికి తేడా వుంటుందని సమాధానం. డబ్బు కోసం పని చేసే కిరాయి రౌడీల్లా హీరోలు కనిపించినా, వాళ్ల లోపల మనిషి లక్షణాలు ఎక్కువగా వుంటాయి.
షోలేని అనుకరిస్తూ ఎన్ని సినిమాలు వచ్చినా తుస్సుమనడానికి కారణం ఈ తేడాని, క్యారెక్టర్ని రైటింగ్లో పట్టుకోలేకపోవడం. రైటింగ్లో లేనిది టేకింగ్లో రాదు. చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. కోతల రాయుల్ని చూస్తే అస్రాని, జగ్దీప్ గుర్తుకొస్తారు. పని రాకపోయినా పై హోదాల్లో ఎక్కువగా వుంటారు వీళ్లు.
నవ్వించి, నవ్వించి కాల్చే అంజాద్ఖాన్కి లేటెస్ట్ వెర్షన్ నేటి రాజకీయ నాయకులు. కాకపోతే వీళ్లు చంపరు. కొండచిలువలా కొంచెం కొంచెం మింగుతారు. దాని పొట్టలో జీర్ణం అవుతున్నప్పుడు కూడా మనం బతికే వుంటాం. అదో విషాదం. సంతోషంగా వుండే జయ, గంభీర దుక్క నదిలా మారిపోతుంది. అమితాబ్ మౌత్ ఆర్గాన్ వినిపిస్తుండగా దీపాల ముందు జయ. ఈ సీన్ ఎన్ని వందల సార్లు చూసినా.. అదో మార్మిక లోకం.
హేమ గౌరవం కాపాడ్డానికి గుర్రం తీసే పరుగు, బర్మన్ వినిపించే తబలా శబ్దం ఇంకా వెంటాడుతూనే వున్నాయి. చివరగా నా అభిమాన డ్యాన్సర్ హెలెన్ మెహబూబా పాట. భారతదేశాన్ని ఒక ఊపు ఊపిన పాట. 85 ఏళ్లలో కూడా హెలెన్ కళ్లలోని కళ, నవ్వుకి మించిన జీవన సారం వుంటుందా? ఆమె డ్యాన్స్ని మాత్రమే ప్రేమించింది. పద్మశ్రీతో సహా అన్నీ అవే వచ్చాయి.
షోలే వచ్చి 50 ఏళ్లైంది. తొలి ప్రేక్షకులతో సహా అందరూ పెద్దాళ్లు అయిపోయారు. చాలామంది పోయారు. సినిమా మాత్రం ఇంకా యవ్వనంగానే వుంది.
- జీఆర్ మహర్షీ










Comments