నాయకులు మారినా.. చెరగని వ్యవస్థల ముద్ర
- Guest Writer
- 7 hours ago
- 2 min read
గుణపాఠాలు, సవాళ్లు, సామాజిక సంస్కరణలు, సంక్షేమ చట్టాలు
వ్యవస్థల బలోపేతానికి పడిన పునాదులు

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి (2026) వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి.
మోడీ యుగం (2014-2026): ఆధునిక భారతదేశ గమనాన్ని శాశ్వతంగా మార్చివేసిందా?
నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోడీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకధాటిగా మూడు సార్లు (2014, 2019, 2024) ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆయన ఒక చారిత్రక రికార్డును సృష్టించారు. ఆయన 12 ఏళ్ల పాలన దేశ గమనాన్ని మార్చింది అనడానికి బలమైన కారణాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల సంకీర్ణ యుగానికి తెరదించి, కేంద్రంలో ఒక బలమైన నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని నెలకొల్పారు. యÖపీఐ, జేఏఎం (జన్ ధన్-ఆధార్-మొబైల్) త్రిశూలం ద్వారా క్షేత్రస్థాయికి డిజిటల్ విప్లవాన్ని తీసుకెళ్లారు. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా మధ్యవర్తుల వ్యవస్థను నిర్మూలించి, సంక్షేమ రంగ రూపురేఖలను మార్చేశారు. విదేశీ విధానంలో పాత తటస్థ వైఖరిని వీడి, దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేశారు. జి20 సదస్సు విజయవంతం చేయడం ద్వారా ‘గ్లోబల్ సౌత్ ’ (అభివృద్ధి చెందుతున్న దేశాల)కు భారతదేశాన్ని ఒక బలమైన ప్రతినిధిగా నిలిపారు.
సమతుల్య కోణం
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామాలు దేశ రూపురేఖలను మార్చినప్పటికీ, ప్రజాస్వామ్యం అనేది నిరంతర ప్రక్రియ. గతంలో వాజ్పేయి హయాంలో పడిన మౌలిక సదుపాయాల పునాది (స్వర్ణ చతుర్భుజి), యూపీఏ హయాంలో వచ్చిన పౌర సాధికారత చట్టాలు (ఆర్టీఐ, ఆర్టీఈ) కూడా నేటి అభివృద్ధికి ఇంధనంగా మారాయి. కాబట్టి, ఇది ఒకరితో మొదలై ఒకరితో ముగిసేది కాదు.. మునుపటి పునాదులపై నిర్మితమైన ఆధునిక సౌధం.
కాంగ్రెస్ విమర్శల వ్యూహం.. లాభమా? నష్టమా?
క్షేత్రస్థాయి వాస్తవం: ఈ ఆరోపణలు ఒకదశలో కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో ఎజెండాను సెట్ చేయడానికి ఉపయోగపడినప్పటికీ, మోడీ ప్రభుత్వ సమగ్ర సంక్షేమ పథకాల ముందు అవి పెద్దగా ఫలించలేదు. పేద ప్రజలు తమకు అందుతున్న ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, ఉజ్వల గ్యాస్ సిలిండర్లను చూశారే తప్ప, కార్పొరేట్ అనుకూల ఆరోపణలను పట్టించుకోలేదు. అయితే, 2024 ఎన్నికల నాటికి ఇదే విమర్శను ‘రాజ్యాంగ పరిరక్షణ’, ‘సామాజిక న్యాయం’, ‘ఆర్థిక అసమానతలతో’ ముడిపెట్టడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకోగలిగింది.
వ్యవస్థల స్వయం ప్రతిపత్తి
భారత ప్రజాస్వామ్య వైశిష్ట్యం ఏమిటంటే.. అది అత్యవసర పరిస్థితి లాంటి చీకటి రోజులను తట్టుకుంది, సంకీర్ణ ప్రభుత్వాల అనిశ్చితిని అధిగమించింది, అలాగే పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాల కాలంలో వచ్చే కేంద్రీకృత సవాళ్లను సైతం ఎదుర్కొంటూ వస్తోంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ భారతీయ ఓటరు అత్యంత పరిణతి చెందినవాడని, ఏ ఒక్క నాయకుడికీ లేదా పార్టీకి ‘బ్లాంక్ చెక్ ’ ఇవ్వడని ప్రతి ఎన్నికల ఫలితం నిరూపిస్తూనే ఉంది. నాయకత్వాల బలాలు, బలహీనతలను తూకం వేస్తూ, తనను తాను నిరంతరం పునరుద్ధరించుకునే శక్తే భారత ప్రజాస్వామ్యం.
- నౌపడ సత్యనారాయణ






Comments