top of page

వారణాసి రహస్యం : అసలు కథ ఇదేనా?

  • Guest Writer
  • 4 days ago
  • 2 min read
ree

రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ‘వారణాసి’ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒకటే చర్చ. ఈ మధ్య విడుదలైన ‘వారణాసి వరల్డ్‌’ గ్లింప్స్‌ చూసిన తర్వాత, సినిమా కథపై ఫ్యాన్స్‌ రకరకాల సిద్ధాంతాలు వినిపిస్తున్నారు. ఇందులో ఒక ఆసక్తికరమైన థియరీ ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమా ఒక ‘టైమ్‌ ట్రావెల్‌’ కాన్సెప్ట్‌ తో సాగే ఫాంటసీ అడ్వెంచర్‌ అని. ఈ థియరీ ప్రకారం, కథలో కుంభా (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) అనే పవర్‌ ఫుల్‌ విలన్‌ ఉంటాడు. అతనికి అమరత్వం కావాలి, ప్రపంచాన్ని కంట్రోల్‌ చేయాలనే అత్యాశ ఉంటుంది. ఆ అమరత్వం కోసం ‘సంజీవని’ అనే మూలిక కోసం వెతుకుతుంటాడు. ఇక మన హీరో రుద్ర (మహేష్‌ బాబు) ఒక సాధారణ వ్యక్తిలా పరిచయం అవుతాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటమే అసలు కథ అని చెప్పుకుంటున్నారు.

కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. సంజీవని ఈ కలియుగంలో దొరకదు. దాన్ని వెతుక్కోవాలంటే త్రేతాయుగానికి వెళ్లాలి. దీనికోసం ఒక టైమ్‌ పోర్టల్‌ ఉంటుంది. ఆ పోర్టల్‌ ఓపెన్‌ అవ్వాలంటే మూడు తాళాలు కావాలి. ఒకటి విభూది, రెండు త్రిశూలం, మూడు నందీశ్వరుడు. ఈ మూడు ఒక్కచోట కలిస్తేనే కాలం వెనక్కి వెళ్లే మార్గం దొరుకుతుందట. రుద్రుడే ఆ విభూది స్వరూపమని, త్రిశూలం పట్టుకుని నందిపై స్వారీ చేస్తాడని, ఆయనే ఆ కీ అని ఈ థియరీ సారాంశం. ఈ క్రమంలో మందాకిని (ప్రియాంక చోప్రా) పాత్ర కీలకంగా మారుతుందట. మొదట్లో ఆమె విలన్‌ వైపు ఉన్నా, తర్వాత నిజం తెలుసుకుని హీరోకి సహాయం చేస్తుందని టాక్‌. ఇలా రుద్రుడు టైమ్‌ ట్రావెల్‌ చేసి, త్రేతాయుగంలో ఆ యుద్ధభూమిలో సంజీవనిని సాధించి, తిరిగి వచ్చి విలన్‌ను అంతం చేస్తాడని అంటున్నారు. క్లైమాక్స్‌ లో ఆస్టరాయిడ్‌ వల్ల వచ్చే వైరస్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడటమే మన హీరో మిషన్‌ అని చెప్పుకుంటున్నారు.

ఇదంతా వినడానికి ఒక హాలీవుడ్‌ రేంజ్‌ కథలా ఉంది. 90ల స్టైల్‌ బ్లాక్‌ బస్టర్‌ డ్రామాకి, మోడరన్‌ విజువల్స్‌ జోడిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది. ఒక మామూలు మనిషి గ్లోబల్‌ అడ్వెంచర్‌ చేసి, చివరకు ప్రపంచాన్ని కాపాడే దేవుడిలా మారడమే రాజమౌళి మార్క్‌ ఎలివేషన్‌ అని మాట్లాడుకుంటున్నారు. అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. రాజమౌళి సినిమా అంటే ఇలాంటి ఎన్నో సర్ప్రైజ్‌లు ఉంటాయి. ఫ్యాన్స్‌ డీకోడ్‌ చేసిన ఈ కథ నిజమవుతుందా లేక జక్కన్న ఇంకేదైనా కొత్త ప్రపంచాన్ని చూపిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా, ‘వారణాసి’ కథపై జరుగుతున్న ఈ చర్చ సినిమాపై అంచనాలను మాత్రం హై లెవెల్‌కి తీసుకెళ్తోంది.

ఆ రూమర్‌ తట్టుకోలేక కాయదు కన్నీళ్లు..!
ree

ఇటీవల కొన్ని కాంట్రవర్సీలు బాగా వైరల్‌ అయ్యాయి. అందులో కొంతమంది హీరోయిన్స్‌ ప్రయివేట్‌ పార్టీలకు వెళ్లాడానికో భారీగా డబ్బులు అందుకుంటున్నట్లు కూడా నేషనల్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక అందులో హీరోయిన్‌ కాయదు లోహర్‌ పేరు కూడా రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్‌ అయ్యారు. తెలుగులో ‘అల్లూరి’ సినిమాతో పాపులర్‌ అయిన కాయదు లోహర్‌ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. త్వరలోనే ‘ఫంకీ’ అనే సినిమాతో ఆమె మరోసారి తెలుగు ఆడియన్స్‌ ముందుకు రాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమెపై ఒక రూమర్‌ గట్టిగా వినిపిస్తోంది. ఆమె సినిమాల్లో నటించడానికి కాకుండా, కేవలం బయట ప్రైవేట్‌ పార్టీలకు అటెండ్‌ అవ్వడానికే భారీగా ఛార్జ్‌ చేస్తున్నారని టాక్‌ నడిచింది. ఆ పార్టీ గురించి కూడా రకరకాల రూమర్స్‌ వచ్చాయి.

అయితే ఒక్కో పార్టీకి హాజరయ్యేందుకు ఆమె ఏకంగా రూ. 35 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని కూడా ఆ వార్తల్లో హైలెట్‌ అయ్యింది. అయితే దీనిపై ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ఆమె, ఫైనల్‌గా స్పందించారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ ఈ రూమర్‌ గురించి ప్రస్తావించారు. పార్టీల గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత అని అడగగానే, కాయదు లోహర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ డౌన్‌ అయ్యారు. తన గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని ఊహించలేదని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘‘నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఇలాంటి సిచువేషన్స్‌ని ఎలా హ్యాండిల్‌ చేయాలో కూడా నాకు తెలియదు. నా గురించి ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ రాసినప్పుడు, అవి నన్ను మెంటల్‌గా చాలా డిస్టర్బ్‌ చేస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాంటి రూమర్స్‌ స్ప్రెడ్‌ చేసేవాళ్లు.. అది ఎదుటి వ్యక్తి లైఫ్‌ని ఎంత డ్యామేజ్‌ చేస్తుందో కనీసం ఆలోచించడం లేదు’’ అంటూ ఆమె తన ఆవేదనను బయటపెట్టారు. తాను అందరితోనూ చాలా కైండ్‌గా ఉంటానని, అయినా తనపై ఎందుకు ఇంత నెగెటివిటీ స్ప్రెడ్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. అయితే ఇండస్ట్రీ అన్నాక ఇవన్నీ కామన్‌ అని, ఇది కూడా తన ప్రొఫెషన్‌లో ఒక పార్ట్‌ అని తనకు తాను సర్దిచెప్పుకుంటున్నట్లు తెలిపారు. కెరీర్‌ పరంగా ఎదుగుతున్న టైమ్‌లో ఇలాంటి పర్సనల్‌ ఎటాక్స్‌ రావడం ఆమెను బాగా హర్ట్‌ చేసినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎమోషనల్‌ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్‌ అవుతున్నారు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page