top of page

వామనుడు టు త్రివిక్రముడు వి‘స్వరూప్‌’ం

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 2 days ago
  • 3 min read
  • వైకాపా రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడిగా మెంటాడ

  • జగన్‌ కోర్‌కమిటీలో స్థానం

  • పార్టీ అధినేతే ఏరికోరి చేర్చిన పేరు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇంతింతై వటుడిరతjైు మరియు దానింతై నభోవీధిపై

నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతjైు ధ్రువుని పైనంతై మహర్వాటిపై

నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధిjైు

.. ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బతుకు ప్రారంభించి, అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడిరతjైు అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద కనీసం మొదటి లైను అయినా నిలిచిపోయింది ఈ పద్యం.

ఎక్కడ శ్రీకాకుళం జిల్లా.. ఎక్కడ వైకాపా రాష్ట్ర యువజన విభాగం..? ఇంతవరకు అధికారంలో ఉన్న పార్టీల్లో మంత్రులుగానో, అంతకు మించో ఇక్కడ సీనియర్‌ రాజకీయ నేతలు పనిచేసుండొచ్చు. కానీ, పార్టీ అనుబంధ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎదగడమంటే చిన్నవిషయం కాదు. అందులోనూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినేత నమ్మి.. ఒకరి భుజస్కందాల మీద ఓ పెద్ద బాధ్యతను పెట్టారంటే ఏ స్థాయిలో నమ్మకం కుదిరివుండాలి. తల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు యువకుడిగానో, అంతకు ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్న మెంటాడ వెంకట స్వరూప్‌ ఇప్పుడు రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. ఆయనకన్నా ముందున్న ఇద్దరు ఎవరయ్యా అంటే.. ఒకరు మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహన్‌ తనయుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. జక్కంపూడి రామ్మోహన్‌ అంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయినా ఆయన చనిపోయేవరకు ఆ పోర్ట్‌ఫోలియోను వేరే వారికి కేటాయించడానికి ఇష్టపడని రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 2014`19లో జక్కంపూడి రాజాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులు నడిరోడ్డు మీద కొడితే, తానున్నాంటూ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చిన కుటుంబం. ఇక రెండో వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సోషల్‌ మీడియాను, యూట్యూబ్‌ ఛానళ్లను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నవారికి భైరెడ్డికి, జగన్మోహన్‌రెడ్డికి ఉన్న అనుబంధం కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటువంటి వారి సరసన యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా నగరానికి చెందిన మెంటాడ స్వరూప్‌ను జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఈ పదవిని మాజీమంత్రి దాడిశెట్టి రాజా సోదరుడికి ఇవ్వాలి. ఆ మేరకు వైకాపా సలహాదారులు జాబితా కూడా సిద్ధం చేశారు. కానీ జగన్మోహన్‌రెడ్డి టేబుల్‌ దగ్గరికెళ్లేసరికి స్వరూప్‌ పేరు వచ్చిచేరింది. ఇప్పటికే స్వరూప్‌ ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగంలో అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇప్పుడు దీనికి అదనంగా రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 నుంచి జగన్మోహన్‌రెడ్డితో స్వరూప్‌కు బంధం బలపడిరది. 2014`19 మధ్య వైకాపా అధికారంలోకి రాకపోయినా జగన్మోహన్‌రెడ్డితో ఉన్న రిలేషన్‌ పెరగడానికి మాత్రం అది అడ్డుకాలేదు. 2019`24 మధ్య వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నా మెంటాడ కుటుంబానికి ఎటువంటి పదవులూ రాకపోయినా జగన్మోహన్‌రెడ్డి కార్యాలయానికి స్వరూప్‌ రాకపోకలు ఆగిపోలేదు. ఉత్తరాంధ్రలో ఏ పర్యటనకు జగన్మోహన్‌రెడ్డి వచ్చినా స్వరూప్‌కు సంబంధించిన మనుషులు ఎదురైనప్పుడు ఆయన కోసం ఆరా తీయడం కేవలం పత్రికల్లో పబ్లిసిటీ కోసం ఇచ్చుకున్న కథనాలు కావు. హెలీప్యాడ్‌ వద్దో, సభావేదిక వద్దో పార్టీ తరఫున ఉన్న కొందరు పెద్దలు చెప్పిన మాటలే ఇవి. జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజుకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించి జగన్మోహన్‌రెడ్డి స్వరూప్‌ అనే పేరును మర్చిపోలేకుండా ముద్ర వేసుకోగలిగారు. అప్పటి సీఎంవో నుంచి గాని, తాడేపల్లి ఇంటి నుంచి గాని స్వరూప్‌ రాకపోకలకు ఇబ్బంది లేకుండాపోయింది. 2014`19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా స్వరూప్‌ చేపట్టిన కార్యక్రమాలు జగన్మోహన్‌రెడ్డి దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత టౌన్‌హాల్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు యువతతో నిర్వహించిన సమావేశాన్ని సూపర్‌హిట్‌ చేయడం వెనుక స్వరూప్‌ పాత్రను జగన్‌కు అప్పటి నాయకులే స్వయంగా వివరించారు. 2024 ఎన్నికల వరకు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గెలుపు కోసం ఎత్తులు, పైఎత్తులు రచించడానికి తెర వెనుకే పరిమితమైపోయిన స్వరూప్‌ ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్‌రెడ్డికి మరింత దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో ధర్మాన ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికలకు ఓటర్ల జాబితా పట్టుకొని ఆయన చేసిన కసరత్తు చిన్నది కాదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐప్యాక్‌ టీమ్‌ అంటూ ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు పట్టుకొని కొందరు హల్‌చల్‌ చేశారు కానీ, అసలు డేటా స్వరూప్‌ వద్దే ఉందనేది పార్టీలో కొందరికి మాత్రమే తెలిసిన సీక్రెట్‌. అక్కడ జగన్మోహన్‌రెడ్డికి, ఇక్కడ ధర్మాన ప్రసాదరావుకు మధ్య గ్యాప్‌ నడుస్తున్న రోజుల్లో కూడా ఈ రెండు పడవల మీద ఒకేసారి ప్రయాణం చేసిన ఘనత స్వరూప్‌దే. అలాగే పక్క జిల్లాలో బొత్స సత్యనారాయణ, ఇక్కడ ధర్మాన కృష్ణదాస్‌ మంత్రులుగా ఉన్నప్పుడు కామన్‌గా రాష్ట్రస్థాయిలో నాయకత్వ బాధ్యతల కోసం ఓ పేరు చెప్పాల్సివస్తే ఇద్దరూ స్వరూప్‌ పేరునే ప్రస్తావించిన సందర్భం ఉండటం చిన్నవయసులోనే పరిణతికి నిదర్శనం. జిల్లాలో ధర్మాన నాయకత్వాన్ని బలపరుస్తూనే కాపు సామాజికవర్గానికి దూరం కాకుండా సమకాలీన రాజకీయాలు నడపడం స్వరూప్‌కే చెల్లింది. వైకాపాలో రాష్ట్రవ్యాప్తంగా అనేకమందితో స్వరూప్‌కు సత్సంబంధాలున్నాయి. ఎంవీ పద్మావతి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చేసినప్పుడు పద్మావతి తనయుడు స్వరూప్‌. పాలనలో తెర వెనుక జోక్యం చేసుకుంటున్నాడు ఆయనకు సన్‌స్ట్రోక్‌ తప్పదంటూ మండువేసవిలో అప్పట్లో కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు స్వరూప్‌ లేకుండా ఒక నియోజకవర్గ స్థాయిలో వైకాపా రాజకీయాలు లేకుండాపోయాయి. స్వయంగా నేతలే ఫలానా విషయంలో చొరవ చూపించాలని స్వరూప్‌ను కోరుతున్నారు. వైకాపా గత ఎన్నికలకు వెళ్లే ముందు ఐసీడీఎస్‌లో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేశారు. కానీ శ్రీకాకుళంలో ఒక్కో కేంద్రాన్ని స్వరూప్‌, ఆయన తల్లి పద్మావతి సమ్మె నుంచి బయటకు తెచ్చి తెరిపించారు. ఎన్నికల్లో ఫలితాలేంటనేది పక్కన పెడితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులుగా ఉన్నవారి నియోజకవర్గాల్లో ఈమాత్రం పని ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్న అప్పట్లో తలెత్తింది. జిల్లాలో వైకాపా పరంగా రాజకీయంగా ఎన్ని గ్రూపులైనా ఉండొచ్చు. కానీ స్వరూప్‌ ఫలానా గ్రూప్‌కు నాయకుడు, లేదా సానుభూతిపరుడు అని చెప్పే సాహసం మాత్రం ఎవరూ చేయలేరు. ధర్మాన ప్రసాదరావు తర్వాత వైకాపా వారసత్వం రాజకీయంగా ఎవరికి వెళ్తుందనేది ఇప్పుడే తేలకపోయినా రేసులో మాత్రం స్వరూప్‌ ఉన్నాడన్న టాక్‌ టౌన్‌లో ఉంది. కాకపోతే కుల సమీకరణాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ధర్మాన ప్రసాదరావును డోల సీతారాములు నాయుడు చేయి పట్టుకొని తన రాజకీయ వారసుడంటూ తెర మీదకు తెచ్చినట్టు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అవకాశాలివ్వాలంటూ కోదండపాణి సంగీత దర్శకుల దగ్గరకు తిప్పినట్టు స్వరూప్‌కు కూడా ఓ అవకాశమొస్తే ధర్మానలాగే సుదీర్ఘ రాజకీయాలు చేయగలడని నమ్మేవారు నగరంలో ఎక్కువమంది ఉన్నారు. కథనం మొదట్లో ఇంతింతై వటుడిరతjైు అన్న పోతనే అదే పద్యంలో వామనుడు త్రివిక్రముడుగా క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ సూర్యబింబం ముందు ఒక గొడుగులాగ తలపై కనిపించి క్రమంగా శిరోరత్నంగాను, చెవి కమ్మగాను, నగగాను, బంగారు జాజుబంతిలాగాను, కరకంకణం లాగాను, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంటగాను, పాదాల అందెగాను, ఆఖరుకు పాదపీఠంగాను కనిపించిందని పోతన భాగవతంలో చెబుతాడు. ఒక్క అవకాశమిస్తే ప్రతిపక్షమైనా పనిచేసి చూపించడానికి చాలని చెప్పడానికి స్వరూప్‌ నియామకమే సాక్ష్యం.



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page