top of page

ఇవి స్వామి భూములే మహాప్రభూ..!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Oct 6, 2025
  • 1 min read

అరసవల్లి సూర్యనారాయణస్వామికి మాన్యం ఉందని అందరికీ తెలుసు. కానీ రికార్డులపరంగా ఎంత ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు. గతంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇది సూర్యనారాయణ స్వామివారికి చెందిన స్థలము, ఆక్రమించినవారు శిక్షార్హులు అంటూ బోర్డులుండేవి. అంతకు క్రితం దేవుడి మాన్యాన్ని రైతులు పండిస్తున్నారని చెప్పుకునేవారు. కొద్దిరోజుల క్రితం అరసవల్లి దేవాలయానికి సంబంధించిన భూములే లేవు.. ఉంటే చూపించండి అని ఆలయ ఈవో అన్నారు. స్వామివారి భూముల్లో బోర్డులు ఇలా పడుకోబెట్టేస్తే.. ఇక ఇది ఆయన భూములని ఎవరు చెబుతారు మహాప్రభో..!?

- సత్యంన్యూస్‌, శ్రీకాకుళం

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page